Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Hyderabad : 48 గంటలు హై అలెర్ట్..  హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం
Hyderabad

Hyderabad : 48 గంటలు హై అలెర్ట్.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం

Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం కీలక ఏర్పాట్లు 72 కృత్రిమ కొలనులు, 20 ప్రధాన సరస్సుల్లో నిమజ్జన సౌకర్యం 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్‌లు సిద్ధంగా హుస్సేన్ సాగర్‌లో 20 క్రేన్‌లు, బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 9 బోట్లు, DRF టీంలు, 200 ఈతగాళ్లు రెడీ 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సజావుగా శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3 షిఫ్టులలో స్వచ్ఛత కార్యక్రమాలు 25 × 7 గంటలు విధుల్లో 15 వేలకు పైగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊర...
గణేష్ విగ్రహాల నిమజ్జనం షురూ.. GHMC పరిధిలో 74 చెరువులు సిద్ధం
Hyderabad, State

గణేష్ విగ్రహాల నిమజ్జనం షురూ.. GHMC పరిధిలో 74 చెరువులు సిద్ధం

GHMC Hyderabad Ganesh immersion 2024 : గణేశ ఉత్సవాల్లో మూడో రోజు శుక్రవారం నగరంలోని వివిధ చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. అనేక మంది భక్తులు తమ ఇళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను సమీపంలోని చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌నం చేశారు. అలాగే కొంతమంది వినాయ‌క మండ‌ళ్ల‌ నిర్వాహకులు కూడా భారీ ఊరేగింపుతో నిమజ్జనానికి త‌ర‌లివ‌చ్చారు.నిమజ్జనం సాధారణంగా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మూడవ రోజు, తరువాత ఐదవ, ఏడవ, తొమ్మిదవ తేదీలలో, చివరికి 10 మరియు 11వ రోజున జరుగుతుంది. ఈ సంవత్సరం, ముఖ్య‌మైన‌ గణేష్ విగ్రహాల‌ నిమజ్జనం సెప్టెంబర్ 6న జరుగుతుంది. 74 చెరువులను సిద్దం చేసిన GHMC నిమజ్జనం కోసం GHMC 74 చెరువులను గుర్తించింది. సజావుగా నిమ‌జ్జ‌నాలు జరిగేలా మూడు షిఫ్టులలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది, క్రేన్లతో సహా సిబ్బంది, యంత్రాలను మోహ‌రించింది. అదనంగా, నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ సరస్సు, IDL సరస్స...
Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం
Crime, Mahaboobnagar

Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం

Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మ‌హిళ త‌న‌ కూతురిని చంపి, ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రేబిస్‌ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకింద‌ని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది....
Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌
Crime

Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌

Adilabad News : రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగిస్తోంది. అవినీతి అధికారుల‌కు ఏసీబీ చుక్క‌లు చూపిస్తోంది. వ‌రుస దాడుల‌తో అక్ర‌మార్కును హ‌డ‌లెత్తిస్తోంది. తాజాగా చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ( Sub-Registrar )ను లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా ప‌ట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ కార్యాయంలో బాధితుడు నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్‌ ఖాన్‌ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. చివ‌ర‌కు రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్‌ లంచం తాలూకు డ‌బ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ...
Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి
Crime

Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి

Hyderabad News | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtami ) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం ఒక్క‌సారిగా ఆగిపోయింది. దీంతో యువ‌కులు వాహ‌నాన్ని నిలిపివేసి చేతులతో లాగుతూ ముందుకు క‌దిలించారు. ఈ క్ర‌మంలోనే విద్యుత్ తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి క‌రెంట్‌ షాక్‌ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం చెందారు. కొంద‌రు సీపీఆర్‌ చేసేందుకు యత్నించినా ప్రాణాలు నిల‌వ‌లేదు. మరో నలుగ...
error: Content is protected !!