Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం..  ఇకపై పీడీ యాక్ట్ అమలు!
State, Hyderabad

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ఇకపై పీడీ యాక్ట్ అమలు!

Drugs Control Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా 'ఈగల్ ఫోర్స్' , పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ తరహా కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కేవలం అరెస్టులతోనే సరిపెట్టకుండా, డ్రగ్స్ సరఫరాదారుల ఆస్తులను కూడా సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ముఖ్యంగా విద్యాసంస్థల విషయంలో డీజీపీ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలు, కాలేజీలు లేదా యూనివర్సిటీ ప్రాంగణాల్లో డ్రగ్స్ దొరికితే, దానికి పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. డ్రగ్స్ సరఫరాతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాలపై కూడా తాము ప...
Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!
Crime

Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!

ఒక తాగుబోతు డ్రైవర్ సృష్టించిన బీభత్సం (Road Accident) మూడు కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది. సాగర్ రోడ్డులోని హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. భవిష్యత్తుపై ఎంతో ఆశలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వంద మీటర్ల మేర ఈడ్చుకెళ్లి.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వస్తున్నాడు. హస్తినాపురం వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయిన కారు మొదట ఒక ద్విచక్ర వాహనాన్ని, ఆపై రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మరో యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బాధితులు కారు కింద చిక్కుకోగా, వారిని సుమారు 100 మీటర్ల మేర అలాగే ఈడ్చుకెళ్లింది. చివరకు కారు పల్టీ కొట్టడంతో వాహనం ఆగిపోయింది. Road Accident : మృతుల వి...
రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal
State, Hyderabad

రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal

Highlightsఒకే గొడుగు కిందకు మూడు విభాగాలుBhu Bharati Portal ప్రాజెక్ట్ అమలు కానున్న 5 మండలాలు ఇవే:భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ప్రత్యేకతలు:సర్వే ప్రక్రియ సాగుతుందిలా.. ఒకే గొడుగు కిందకు మూడు విభాగాలు Bhu Bharati Portal Pilot Launch | తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందించిన 'భూభారతి' (Bhu Bharati) పోర్టల్‌ను రేపటి నుంచి (ఏప్రిల్ 2) ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో ప్రారంభించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను సమన్వయం చ...
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:
State, Hyderabad

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:

14 మంది మావోయిస్టుల మృతి.. కీలక నేత హతం! రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి తూటాల గర్జన వినిపించింది. శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు (Maoist Encounter) మరణించారు. వీరిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. సుక్మా జిల్లాలో 12 మంది మృతి సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున పామ్లూరు గ్రామం సమీపంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్య నేత హతం: ఈ ఎన్‌కౌంటర్‌లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి 'మంగడు' మరణించారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మృతులు: మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్...
Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు
National

Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు

న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పు మరియు దాని రూపురేఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. యుపిఏ హయాంలో కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణయాన్ని కనీసం కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. "ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా?" అని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధ...
error: Content is protected !!