Sarkar Live

Author: SreeRam

శ్రీరామ్ వెన్ను గారికి పదిహేను సంవత్సరాలకు పైగా జర్నలిజంలో అనుభవం ఉంది. ప్రముఖ పత్రికలు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులలో పనిచేసారు. రాము వెన్ను వెబ్ సైట్ రూపకల్పన మరియు కంటెంట్ జనరేషన్ లలో నిష్ణాతులు.
Holiday | నేడు పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు మూసివేత
LifeStyle

Holiday | నేడు పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు మూసివేత

November 5 Holiday in Telangana | అనేక రాష్ట్రాల్లో బుధవారం నవంబర్ 5, 2025న పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. నవంబర్ 5న గురునానక్ జయంతి, ప్రభుత్వ సెలవుదినం. దీని కోసం ప్రభుత్వం గెజిటెడ్ సెలవు ప్రకటించింది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవుపై అయోమ‌యానికి గుర‌వుతున్నారు.సెలవు ఉంటుందని కొందరు, లేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కాగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అధికారిక సెలవు ప్ర‌క‌టించారు. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్ లో సెలవు దినంగా పేర్కొన‌బ‌డి ఉంది. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే. ఇలా హిందువులు, సిక్కులకు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి రేపు (బుధవారం) పూర్తిస్థాయిలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో ఉంటుందా? ఆంధ...
కాశీబుగ్గ తొక్కిస‌లాట‌ ఘటనకు కార‌ణాలివే.. – Kasibugga temple stampede
State, AndhraPradesh

కాశీబుగ్గ తొక్కిస‌లాట‌ ఘటనకు కార‌ణాలివే.. – Kasibugga temple stampede

Kasibugga temple stampede | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తీవ్ర‌ విషాదం అలుముకుంది. శనివారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.క్షత‌గాత్రుల‌ను సమీపంలోని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని టెక్కలిలోని హాస్పిట‌ల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో ఏడుగురు మరణించగా, హాస్పట‌ల్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు తర్వాత మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణాలేంటి? ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయంలోని రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపడటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్ల‌డంచారు. ఒక్క‌సారిగా పెద్దఎత్తున భక్తులు క్యూలోకి రావడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. అనుమతుల్లేకుండా ఏర్పాట్లు ఈ ఘటనపై ఏపీ స‌ర్కారు త...
Cyclone Montha | తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం
AndhraPradesh, State

Cyclone Montha | తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం

Amaravati : పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన 'మోంత' తుఫాను (Cyclone Montha) గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం నుండి వాయువ్య దిశగా కదిలి మంగళవారం ఉదయం 5.30 గంటలకు తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నానికి దక్షిణం నుంచి ఆగ్నేయంగా 190 కి.మీ, కాకినాడకు దక్షిణం నుంచి ఆగ్నేయంగా 270 కి.మీ, వైజాగ్‌కు దక్షిణం నుండి ఆగ్నేయంగా 340 కి.మీ దూరంలో వాతావరణ వ్యవస్థ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మోంతా తుఫాను గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా మారింది. ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నంకు దక్షిణం నుండి ఆగ్నేయంలో 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది" అని వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం, రాత్రి సమయంలో కాకినాడ చుట్టూ మచిల...
Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌
State, AndhraPradesh

Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌

Cyclone Montha News Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మొంథా’ తుఫాన్‌గా (Cyclone Montha) మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది. గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న‌ట్లు భార‌త వాతావర‌ణ శాఖ వెల్ల‌డించింది. కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రింది. , సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తుఫాను సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని IMD తెలిపింది. ఈ తుఫాను (Cyclone Montha ) ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 5 సెం.మీ. నుండి 20 సెం.మీ....
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao
Crime

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao

Mallojula Venugopal Rao : మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అడ‌వి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం తన 60 మంది మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. సీఎం స‌మ‌క్షంలో వీరు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. దాదాపు మావోయిస్టు పార్టీ రెండో అగ్రస్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ న‌ష్టంగా భావిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ వైఖరితో అసంతృప్తి వ్య‌క్తంచేస్తూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని విప్ల‌వోద్య‌మాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మల్లోజులపై దాదాపు వందకు పైగా కేసులు కూడా ఉన్నాయి. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డ...
error: Content is protected !!