Sarkar Live

Author: SreeRam

శ్రీరామ్ వెన్ను గారికి పదిహేను సంవత్సరాలకు పైగా జర్నలిజంలో అనుభవం ఉంది. ప్రముఖ పత్రికలు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులలో పనిచేసారు. రాము వెన్ను వెబ్ సైట్ రూపకల్పన మరియు కంటెంట్ జనరేషన్ లలో నిష్ణాతులు.
Nobel Peace Prize 2025 :   వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
World

Nobel Peace Prize 2025 : వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

Nobel Peace Prize 2025 : 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరిపోయింది. వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు ఈ గౌరవం లభించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆమె అవిశ్రాంత పోరాటం చేసినందుకు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పుర‌స్కారం లభించింది. వెనిజులాను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మార‌డానికి ఆమె నాయకత్వం, పోరాటాన్ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఆమె ప్రయత్నాలను "ప్రజాస్వామ్య విలువల ప్రపంచ రక్షణకు చిహ్నం"గా నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఇది డోనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోవాలనే కలను చెదరగొట్టింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు. "ఆమె ప్రాణాలకు తీవ్రమైన బెద...
TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…
State, Hyderabad

TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…

ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు… TG News | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Local Body Elections) బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ ద...
KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌
State, Hyderabad

KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ర‌ద్దు చేసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌గురువారం 'చలో బస్‌భవన్‌' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగి. బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR ), మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao)ను పోలీసులు గృహ‌నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, చలో బస్‌భవన్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు వెళ్లాలని నిర్ణ‌యించుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వ...
error: Content is protected !!