భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ కార్యాలయంలో(టైపిస్ట్ )కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సిహెచ్.నవక్రాంత్ బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డాడు. నవక్రాంత్ రేషన్ కార్డ్ ఆన్లైన్లో అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రూ.2500 బాధితుల వద్ద నుంచి నవక్రాంత్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు.
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగల