Hyderabad : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) వీసీగా ఘంటా చక్రపాణి (Ghanta chakrapani )ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రం ఆచార్యులుగా చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కాగా చక్రపాణి ఈ పదవీలో ముడేళ్లపాటు కొనసాగుతారు. కాగా ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్. ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపిసి ) పూర్తి చేశారు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీ ఆఫ్ రిలిజియన్లో పీహెచ్డీ పూర్తి చేశారు. అలాగే సోషియాలజీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు.