Sarkar Live

Business

Union Budget 2025 | గుడ్ న్యూస్..  రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌
Business

Union Budget 2025 | గుడ్ న్యూస్.. రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌

Union Budget 2025 : మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు, ఉద్యోగుల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభ‌వార్త చెప్పారు. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు ఇకపై ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజు పార్ల‌మెంటులో వార్షిక‌ బ‌డ్జెట్ (Union Budget 2025) ప్ర‌వేశ‌పెట్టిన ఆమె ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆశ‌లు నెర‌వేర్చిన కేంద్రం ఇన్‌కం ట్యాక్స్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూ వ‌స్తున్నారు. దీంతో కేంద్ర ఈ నిర్ణ‌యం తీసుకుంది. నిర్మ‌లా సీతారామ‌న్ వరుసగా ఎనిమిదోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండ‌గా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌పై ఆసక్తిగా పేదలు, మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు. చివ‌ర‌కు వారి ఆశ‌లు నెర‌వేరాయి. Union Budget 2025 : మ‌ధ్య త‌ర‌గ‌తి క...
UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు
Business

UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు

UPI contribution : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విప్ల‌వాత్మ‌క వృద్ధి చెందుతోంది. డిజిట‌ల్ పేమెంట్స్‌లో 2019లో 34 శాతం ఉన్న యూపీఐ వాటా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. 2024 నాటికి ఇది 83 శాతానికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో యూపీఐ 74 శాతం వృద్ధి రేటుతో (CAGR - క్యూమ్యులేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్) అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విష‌యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్ సిస్టం రిపోర్టు ద్వారా వెల్ల‌డైంది. త‌గ్గుముఖం ప‌ట్టిన ఇత‌ర చెల్లింపులు ఇతర చెల్లింపు వ్యవస్థలైన RTGS, NEFT, IMPS, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి వాటి వాటా మాత్రం ఐదేళ్లకాలంలో 66 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. ఇది యూపీఐ పాయింట్‌ను మరింత స్పష్టంగా చూపుతోంది. యూపీఐ వల్లనే భారతదేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో ముందు వరుసలో నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు. సులువైన ప‌ద్ధ‌త...
Rupee rises : బ‌ల‌ప‌డిన రూపాయి విలువ‌… ఎంతంటే..
Business

Rupee rises : బ‌ల‌ప‌డిన రూపాయి విలువ‌… ఎంతంటే..

Rupee rises : రూపాయి (Rupee) మార‌క విలువ పెరిగింది. ఈ రోజు ఉద‌యం ట్రేడింగ్‌లో వృద్ధి చెందింది. అమెరిక‌న్ డాల‌ర్ (US dollar)తో పోల్చితే బ‌ల‌ప‌డింది. ప్ర‌ధానంగా దేశీయ‌ ఈక్విటీల ప్ర‌భావం, అమెరిక‌న్ క‌రెన్సీ ఇండెక్స్ (American currency index) నిగ్ర‌హం వ‌ల్ల ఇది సాధ్య‌మైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. Rupee rises : ఎంతంటే… అమెరిక‌న్ డాల‌ర్‌తో పోల్చితే భార‌తీయ రూపాయి విలువ 18 పైస‌లు బ‌ల‌ప‌డింది. 86.26 వద్ద స్థిరంగా ఉంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజ్‌లో రూపాయి 86.31 వద్ద ప్రారంభమై, డాలర్‌తో పోల్చితే 86.26 వద్ద చేరింది. ఇది గత ముగింపు స్థాయి క‌న్నా ఇది 18 పైసలు ఎక్కువ‌. రూపాయి బలపాటుకు కారణాలు ఫారెక్స్ (Forex) నిపుణుల ప్రకారం బలహీనమైన ముడి చమురు ధరలు (crude oil prices), దేశీయ మార్కెట్ల ధనాత్మక ప్రభావం రూపాయి మార‌క విలువ వృద్ధికి దోహ‌ద‌ప‌డ్డాయి. విదేశీ నిధుల భారీ నిష్క్రమణలు కార‌ణ‌మ...
Amazon | తెలంగాణలో అమెజాన్ రూ. 60,000 కోట్ల పెట్టుబ‌డులు
Business

Amazon | తెలంగాణలో అమెజాన్ రూ. 60,000 కోట్ల పెట్టుబ‌డులు

Amazon Web Services in Telangana : తెలంగాణలో డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను విస్త‌రించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. రూ.60,000 కోట్ల పెట్టుబడితో ముందుకొస్తోంది. ఈ విష‌యాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్నాం: AWS వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక దినోత్సవంలో ఏడ‌బ్ల్యూఎస్ (Amazon Web Services) వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె (Michael Punke), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister A Revanth Reddy), ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu)తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబ‌డులు, సాంకేతిక రంగంలో అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లపై చ‌ర్చించి ఒప్పందాల‌ను కుదుర్చుకున్నారు. అనంత‌రం ప్ర‌పంచ ఆర్థిక దినోత్స‌వం వేదిక‌గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె కీ...
Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి
State, Business

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్ (CapitaLand Group), హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. కంపెనీ CEO & ED గౌరీ శంకర్ నాగభూషణం ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణలో పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థా...
error: Content is protected !!