Sarkar Live

Business

APGVB | ఖాతాదారులకు అలర్ట్..  ఏపీజీవీబీ ఇక ఉండ‌దు..
Business

APGVB | ఖాతాదారులకు అలర్ట్.. ఏపీజీవీబీ ఇక ఉండ‌దు..

APGVB Bank Merger : ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB ) తెలంగాణ‌లో ఇక ఎక్క‌డా క‌నిపించ‌దు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB)లో అది క‌లవ‌నుంది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభం నుంచి ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 493 శాఖ‌లు ఉన్న APGVB తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం కానుంది. మొత్తం 928 శాఖ‌లతో కొత్త రూపం దాల్చ‌నుంది. ఇది రూ. 70 వేల కోట్ల లావాదేవీల‌ను నిర్వ‌హించ‌నుంద‌ని అంచ‌నా. ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకులో భాగంగా.. రాష్ట్రాల వారీగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏపీజీవీబీని టీజీబీలోకి విలీనం చేయాల‌ని నిర్ణయించింది.ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు స్ఫ‌ర్తితో ఈ ప్ర‌క్రియ చేప‌ట్టింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) 2025 జ‌న‌వ‌రి 1న ఆవిష్క‌రించ‌నుంద‌ని చైర్‌పర్స‌న్ ఇ.శోభ తెలిపారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ ...
2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి
Business

2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి

Telecom News | భారత టెలికాం (Indian telecom industry) ఆదాయం గ‌ణీయంగా పెరిగింది. FY25 రెండో త్రైమాసికంలో 8 శాతం (త్రైమాసికం వారీగా) పెరిగి రూ.674 బిలియన్ (ఏటా 13 శాతం వృద్ధి) చేరింది. ఇది ప్రధానంగా టారిఫ్ పెంపుల వల్ల సాధ్య‌మైంద‌ని వెల్ల‌డైంది. మొబైల్ నెట్‌వర్క్‌ల‌ టారిఫ్‌లు విడత‌లుగా పెరగ‌డంతో దీంతో భారత టెలికాం త్రైమాసిక ఆదాయం సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు 96 శాతం వృద్ధి చెందింది. అంటే.. ఐదేళ్ల వార్షిక వృద్ధి రేటు (CAGR) 14 శాతానికి చేరింది. మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. Telecom Industry రెండింత‌ల వృద్ధి భారత టెలికాం పరిశ్రమలో సాంకేతికంగా సమీకృత మార్కెట్ నిర్మాణం, అధిక డేటా వినియోగం, తక్కువ ARPU (ప్రతి యూనిట్ ఆదాయం), టెలికాం కంపెనీలు తగినంత రాబడి పొందలేకపోవడం వంటి ప‌రిణామాల దృష్ట్యా టారిఫ్ (tariff)లు పెరిగాయ‌ని...
Isha Ambani | రంగులు మారే కారు.. ఇషా అంబానీ సొంతం.. ధ‌ర ఎంతంటే..?
Business

Isha Ambani | రంగులు మారే కారు.. ఇషా అంబానీ సొంతం.. ధ‌ర ఎంతంటే..?

Isha Ambani : భారతదేశ దిగ్గ‌జ వ్యాపారి, అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఇటీవల ముంబై వీధుల్లో బెంట్‌లీ బెంటేయ్గా SUV (Bentley Bentayga SUV) లో కనిపించారు. ఈ కారును ప్రత్యేకమైన‌ది… అద్భుత ఫీచ‌ర్స్ క‌లిగి ఉంటుంది. ముఖ్యంగా సూర్యకాంతిలో దానంత‌ట అదే ఆటోమెటిక్‌గా రంగులను మార్చుకుంటుంది. దీని ధ‌ర కోట్ల‌లోనే ఉంటుంది. విలాస‌వంత జీవితం గ‌డుపుతున్న అంబాని కుటుంబంలో ఉన్న అత్య‌ధిక ఖ‌రీదైన కార్ల జాబితాలో ఇది కూడా వ‌చ్చి చేరింది. అత్యంత ఖ‌రీదైన కారు ఇషా అంబానీ బెంట్‌లీ బెంటేయ్గా V8తో ఇటీవల నటుడు రణబీర్ కపూర్ నివాసం వద్ద కనిపించింది. ఆమె వ‌ద్ద‌ మెర్సిడెస్ G-వాగన్, ఇతర విలాసవంతమైన వాహనాలు కూడా ఉన్నాయి. కొత్త‌గా ఆమె కొన్న కారు మ‌రింత విలాస‌మైన‌ది. అత్య‌ధిక ఖ‌రీదైనది. రంగులు ఎలా మార్చుకుంటుందంటే.. ఇషా అంబానీ (Isha Ambani)కి చెందిన బెంట్‌లీ బెంటేయ్గా మొదట తెలుపు రంగులో ఉంటుంది. దీన...
Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!
Business

Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!

Adani | ముంబైలోని ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టుకు అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ మంజూరును బాంబే హైకోర్టు (Bombay High Court) స‌మ‌ర్థించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌ను ఈ రోజు కొట్టేసింది. అభ్యంత‌రాల‌కు బ‌ల‌మైన కార‌ణాలు చూప‌క‌పోవ‌డంతో దీన్ని తిర‌స్క‌రిస్తున్నామ‌ని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani Properties Private Ltd)కు టెండర్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (UAE-based Seclink Technologies Corporation) సంస్థ ఈ పిటీష‌న్‌ను 2022లో దాఖలు చేసింది. దీన్ని ప‌రిశీలించిన హైకోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. టెండ‌ర్ ఖ‌రారుతో వివాదం 2022లో నిర్వహించిన 259 హెక్టార్ల ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ (Dhar...
food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌
Business

food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌

Shantanu Deshpande comments on food Delivery : భార‌త‌దేశంలో ఫుడ్ డెల‌వ‌రీ కంపెనీలు, వాటికి అల‌వాటు ప‌డిన వినియోగ‌దారుల‌పై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శాంతాను దేశ్‌పాండే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌రిత ఆహార స‌ర‌ఫ‌రా (క్విక్ డెలివ‌రీ) అనేది ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే చ‌ర్య అని అభివ‌ర్ణించారు. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం భార‌త్‌లో పెరుగుతోంద‌ని, దీని వ‌ల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లింక్డ్‌ఇన్‌లో తన అభిప్రాయాలను ఆయ‌న ఇలా వ్య‌క్త‌ప‌రిచారు. పోష‌కాహారాన్ని మ‌ర‌చిపోయామ‌ని ఆవేద‌న‌ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం వల్ల ఆరోగ్య‌ప‌ర‌మైన పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నామ‌ని శాంతాను అన్నారు. ఇవి ఎక్కువగా పామాయిల్, చక్కెరతో నిండి ఉంటాయ‌ని తెలిపారు. మ‌నం ఆహార దిగుబ‌డికి మాత్ర‌మే ప్రాధాన్య‌మిస్తున్నామ‌ని, పోష‌క విలువ‌ల‌ను ప‌ట్ట...
error: Content is protected !!