Stock Market :స్థిరంగా దేశీయ మార్కెట్ సూచీలు
Stock Market : దేశీయ బెంచ్మార్క్ సూచీలు ఈ రోజు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీపై PSU బ్యాంక్, ఫార్మా, FMCG, రియాల్టీ, మీడియా, ఎనర్జీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం 9.31 గంటలకు సెన్సెక్స్ 65.75 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 78,573.16 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 23.15 పాయింట్లు లేదా 0.10 శాతం పెరిగి 23,766.05 వద్ద ఉంది.
సానుకూలంగా మార్కెట్ ధోరణి
మార్కెట్ ధోరణి సానుకూలంగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) లో 1,366 స్టాక్స్ గ్రీన్లో ఉండగా, 529 స్టాక్స్ రెడ్లో ఉన్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో Q3 కార్పొరేట్ ఆదాయాలు గణనీయంగా పుంజుకోవడం సాధ్యం కాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారరరు. ఇది పెట్టుబడిదారులు మందగమనాన్ని అధిగమించే విభాగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తుందని అంటున్నారు.
సెక్టార్ల ప్రదర్శన
నిఫ్టీ బ్యాంక్ 21 పాయింట్లు లేదా 0.04 శాతం పెరి...




