Sarkar Live

career

Career, job News, Job alert

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU
career

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU

TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌వు. వాటిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు ఈ ప‌రీక్ష కేంద్రాల‌ను తొల‌గిస్తున్నామ‌ని పేర్కొంది. రిజ‌ర్వేష‌న్ల నేపథ్యంలో మార్పు తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ సీట్లు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ సీట్ల కోసం పోటీ పడేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది.ఇప్పటివరకు ప్రతి ఏడాది TG EAPCETలో సుమారు 55 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాల్గొనేవారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరు...
Revisions to Engineering syllabus | తెలంగాణలో ఇంజ‌నీరింగ్ విద్య‌లో సిల‌బ‌స్ మార్పు..
career

Revisions to Engineering syllabus | తెలంగాణలో ఇంజ‌నీరింగ్ విద్య‌లో సిల‌బ‌స్ మార్పు..

Revisions to Engineering syllabus : తెలంగాణ‌లో పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ విద్య ఉండాలంటోంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) . అందుకు సిల‌బ‌స్‌లో కీల‌క మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇది దోహ‌ప‌డుతుంద‌ని భావిస్తోంది. ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ కోర్సును నవీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల ప్రకారం కమిటీ సిఫార్సులు చేసింది. Engineering Education పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ పోటీకి సిద్ధంగా ఉండేలా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిలబస్‌లో మార్పులు అవసరమని తెలిపారు. ప్రత్యేకంగా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స...
Anganwadi posts | తెలంగాణలో అంగ‌న్‌వాడీల నియామ‌కం.. స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్
career

Anganwadi posts | తెలంగాణలో అంగ‌న్‌వాడీల నియామ‌కం.. స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్

Anganwadi posts : తెలంగాణ‌లో అంగ‌న్‌వాడీల భారీ నియామ‌కాల‌కు ప్ర‌భుత్వం (Telangana government) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తినిచ్చింది. వీటిలో 6,399 అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, 7,837 అంగ‌న్‌వాడీ సహాయ‌కుల పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత భారీ సంఖ్య‌లో అంగ‌న్‌వాడీల (Anganwadi) నియామ‌కాలు చేప‌ట్ట‌డం ఇదే ప్ర‌థ‌మం. ఫైల్‌పై సంత‌కం చేసిన మంత్రి సీత‌క్క‌ అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు సంబంధిత ఫైల్‌పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క (Women and child welfare minister Danasari Seethakka) సంత‌కం చేశారు. త్వ‌ర‌లోనే దీని నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. 65 సంవత్సరాలు పూర్తయిన 3,914 మంది అంగ‌న్‌వాడీలు ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వారి స్థానంలో కొత్త‌వారిని నియమించ‌డంతో మ‌రి...
AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..
career

AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..

AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ రంగానికి చెందిన కోర్సులకు సంబంధించి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నుంది. AP CETs 2025 Schedule : పూర్తి వివ‌రాలు ఇవే.. పీహెచ్‌డీ కోర్సులకు ఏపీఆర్‌ సెట్‌ (APRSET) మే 2 నుంచి మే 5 వరకు. మే 6న‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా లేటరల్ ఎంట్రీకి ఏపీ ఈసెట్‌ (AP ECET) మే 7న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏపీ ఐసెట్‌ (AP ICET) మే 19 నుంచి 20 వ‌ర‌కు వ్యవసాయం, ఫార్మసీ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 21 నుంచి 27 వ‌ర‌కు ఇంజినీరింగ్ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 25న ఏపీ లా సెట్...
Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక  క‌స‌రత్తు షురూ..
career

Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక క‌స‌రత్తు షురూ..

Young India Residential Schools | తెలంగాణ‌లో యంగ్ ఇండియా రెసిడెన్సియ‌ల్ స్కూల్స్ ఏర్ప‌డ‌నున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం క‌స‌రత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల‌ కోట్లను స‌ర్కార్ ఇప్ప‌టికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాల్లో ఒక్కొక్క‌టి చొప్పున ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటవుతున్నాయి. ఒక్కోదానికి 20-25 ఎక‌రాల భూమి అవ‌స‌రం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ స్కూల్స్ నిర్మాణానికి భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) ఆదేశించారు. శుక్రవారం జరిగిన విద్యా సమీక్ష సమావేశంలో ప‌లు అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు. Young India Residential Schools లో ఎలాంటి సౌక‌ర్యాలంటే.. యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాస...
error: Content is protected !!