UPSC Mains 2025 | ఈనెల 22 నుంచి సివిల్ మెయిన్స్.. అడ్మిట్ కార్డులు విడుదల
UPSC Mains 2025 | భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఒకటి. ఇవి ఈ నెల 22 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలు (The Union Public Service Commission-UPSC) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి హోదాల్లో నియామకాల కోసం నిర్వహిస్తారు. దేశంలోని లక్షలాది మంది అభ్యర్థులు దీనికి హాజరవుతారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పరీక్షలు (UPSC Mains 2025) క్రమబద్ధంగా, కఠిన నియమావళి ప్రకారం జరుగనున్నాయి.
ఐదు రోజులపాటు పరీక్షలు
ఈ సంవత్సరం మెయిన్ పరీక్షలు ఐదు రోజులు కొనసాగనున్నాయి. ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరగనున్నాయి. ప్రతిరోజూ వేర్వేరు పేపర్లు, విభిన్న అంశాలపై పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ ఎంపిక చేసిన సబ్జెక్టులు, తప్పనిసరి పేపర్లను రాయాల్సి ఉంటుంది.
UPSC Mains 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ?
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలోని ...




