Sarkar Live

Crime

ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..
Crime

ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..

రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు లంచం తీసుకుంటూ ఏఈ అవినీతి నిరోధక శాఖ (ACB )కి చిక్కారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్ విభాగం AE ) స్వరూపను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ ఏఈ స్వరూపను కోరారు. అయితే బిల్లులు చెల్లించేందుకు ఏకంగా రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక స‌ద‌రు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఏసీబీ యూనిట్‌ ఆధ్వర్యంలో ప‌క్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈ స్వరూపను ...
Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..
Crime, National

Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..

Karnataka - Chikkaballapura | కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక సర్జన్ (Government Doctor) శస్త్రచికిత్స కోసం రోగుల నుంచి లంచం (Corruption) డిమాండ్ చేయ‌డంతో ప్ర‌భుత్వం అత‌డిని సస్పెండ్ చేసింది. డాక్టర్ నరసింహమూర్తి, రోగుల నుంచి శస్త్రచికిత్స చేయడానికి గాను వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చూపించిన ఒక‌ వీడియోను జూన్ 11న స్థానిక టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం కావ‌డంతో అది వైర‌ల్ గా మారింది. ఆ వీడియో ప్ర‌జ‌ల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆరోగ్య శాఖ, ప్రభుత్వ అధికారులను ఇరుకున‌పెట్టింది. డిపార్ట్‌మెంట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్ నరసింహమూర్తి ఆగస్టు 2019 నుంచి గుడిబండే పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ఇన్‌ఛార్జ్ తాలూకా ఆరోగ్య అధికారిగా ఉన్నారు. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యే సమయానికి సుమారు ఐదేళ్ల పది నెలలు ఆ పదవిలో ఉన్...
ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..
Crime

ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..

ACB Raids in Mulugu | కొన్ని రోజులుగా  ఏసీబీ (Anti-Corruption Bureau) దూసుకుగా ముందుకు దూసుకుపోతోంది.  రాష్ట్ర  వ్యాప్తంగా అవినీతి అధికారుల‌పై ఉక్కు మోపుతోంది. ఏ చిన్న ప‌నికైనా  ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటోంది.  తాజాగా ఈరోజు (జూన్ 16న‌) లంచం తీసుకుంటుండగా  ములుగు జిల్లా డీఈవో (District Educational Officer), జూనియర్ అసిస్టెంట్ ను అరెస్టు చేశారు అనిశా అధికారులు. సిక్ లీవ్ నుంచి రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయునికి పోస్టింగ్ ఇచ్చేందుకు డీఈవో, జూనియర్ అసిస్టెంట్.  ఏకంగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారు  దీంతో బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలో ఉపాధ్యాయుడి నుంచి డీఈవో ఫణిని రూ. 15000, జూనియర్ అసిస్టెంట్  దిలీప్  రూ.5 వేలు  లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దిడీఈవో ఫణిన...
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..

ACB Raids | ఇంటి నెంబర్, వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటు కోసం డ‌బ్బులు డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ కార్య‌ద‌ర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుదేరా జీపీలో గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమ‌తి, కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పి.నాగలక్ష్మి రూ.8వేలు లంచం (Bribe) డిమాండ్ చేశార‌ని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించ‌గా వారు రంగంలోకి దిగారు. సోమవారం బుదేరాలోని జీపీ కార్యాలయంలో రూ.8 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు జీపీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ (ACB) అధికారులు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి...
Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి
Crime

Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి

కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో కూలిపోయింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ఈ ప్ర‌మాదం (Helicopter Crashes) లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌.. కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి బ‌యలుదేరింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్‌ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో హెలికాప్ట‌ర్ లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పైలట్‌తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు స‌మాచారం. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కాగా ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బందిని పంపామని, అయితే హెలికాప్టర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోవడంతో అక్కడికి చేరుకోవడం కొంత జాప్య‌మ‌వుతోంద‌ని అధికారులు వెల్లడించారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ ...
error: Content is protected !!