Sarkar Live

Crime

 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse
Crime, National

 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse

Delhi Building Collapse : న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో శిథిలాల కింద ప‌లువురు చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల నుంచి ముగ్గురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప‌లు సంస్థలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. "శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోవచ్చు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "ఉదయం 7 గంటలకు భవనం కూలిపోయినట్లు మాకు కాల్ వచ్చింది. ఏడు అగ్నిమాపక దళాలు సహా స‌హాయ‌క బృందాలు పనిచేస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అధికారి తెలిపారు. స్థానికులు ఉదయం నడకకు వెళ్లినప్పుడు భవనం కూలిపోయింది. వీరిలో చాలామంది అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత అగ్నిమాపక శాఖ సహాయంతో, ముగ్గురిని రక్షించారు. సీలంప...
Bribe ఏసీబీ వలలో సబ్​ఇన్​స్పెక్టర్​
Crime

Bribe ఏసీబీ వలలో సబ్​ఇన్​స్పెక్టర్​

మహిళా పోలీస్ స్టేషషన్​ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) కి పట్టుబడ్డాడు. కుటుంబ కలహాలతో అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ వ్యక్తి గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్​కు వచ్చాడు. ఆ కేసు విచారణ చేస్తున్న ఎస్సై వేణుగోపాల్ బాధితుడి మీద అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేస్తానని, కేసు లేకుండా చూసుకుంటానని అందుకు తనకు కొంత మొత్తం (Bribe ) ఇవ్వాలని ఒప్పందంకుదుర్చుకున్నాడు. దీనికి బాధితుడు అంగీకరించి లంచమిచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు గురువారం సాయంత్రం గచ్చిబౌలి మహిళా పోలీస్టేషన్ ఎస్సై వేణుగోపాల్ బాధితుడి వద్ద నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేణుగోపాల్ ఇటీవలే పదోన్నతిలో భాగంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్...
పాల వ్యాపారంలో కల్తీ మాఫియా.. రాచకొండ ఎస్ఓటీ దాడుల్లో వెలుగులోకి..  – Adulterated milk racket
Crime

పాల వ్యాపారంలో కల్తీ మాఫియా.. రాచకొండ ఎస్ఓటీ దాడుల్లో వెలుగులోకి.. – Adulterated milk racket

Bhuvanagiri News | రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటి) అధికారులు భువనగిరిలోని రెండు యూనిట్లపై రెండు వేర్వేరు దాడులు నిర్వహించి కల్తీ పాల రాకెట్‌ (Adulterated milk Rocket) ను ఛేదించారు. పాలను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేశారని, ఎల్బీ నగర్, ఉప్పల్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌లోని స్వీట్ షాపులకు విక్రయించారని భోంగిర్ ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ డి. ప్రవీణ్ బాబు గురువారం తెలిపారు. Adulterated milk : ఇద్దరు నిందితుల అరెస్టు.. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేసిన పాలను విక్రయిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సామల సత్తి రెడ్డి, కె. రఘు పట్టుబడ్డారని ఎస్​ఓటీ ఇన్​స్పెక్టర్​ తెలిపారు. నిందితులు పాలపొడిని కొనుగోలు చేస్తున్నారని, దీనిని సాధారణంగా బేకింగ్​ ఆహార పదార్థాలను తయారు చేయడానికి, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన పాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు...
ACB | రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Crime

ACB | రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

Nalgonda News : రూ. 70వేలు లంచం తీసుకుంటూ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) జావేద్ సోమవారం ఏసీబీ (Telangana ACB) అధికారులకు ప‌ట్టుబ‌డ్డాడు. న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖ (Civil Supplies)లో డీటీగా విధులు నిర్వహిస్తున్న జావేద్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడిన మూడు వాహనాలను విడిపించేందుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేన‌ని చెప్పడంతో, రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి జావేద్ డబ్బులు అడిగినట్లు నిర్ధారించారు. సోమవారం అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు - Whatsapp (9440446106), Facebook (Telangana ACB), x లో (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు. బాధ...
Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం
Crime

Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

సంభాల్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. జెవానై గ్రామంలో పెండ్లి బృందంతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఓ కళాశాల గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు (24) సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన స‌మీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెవానై కమ్యూనిటీ ఆరోగ్య‌కేంద్రానికి తరలించారు. ప్రధాని మోదీ సంతాపం కాగా, సంభాల్‌ (Sambhal)లో వరుడితో పాటు ఎనిమిది మంది మరణించిన ప్రమాదం (Road Accident)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ (x) లో పేర్కొన్నారు. మృతుల కు...
error: Content is protected !!