Sarkar Live

Crime

Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌
Crime

Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌

హైదరాబాద్ (Hyderabad)లోని ట‌ప్పాచబుత్ర (Tappachabutra) ప్రాంతంలో ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ మందిరం (Hanuman temple) లో మాంసపు ముక్కలు (Meat) క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్రధాన అర్చకుడు (Temple priest) ముందుగా ఈ విషయాన్ని గమనించారు. ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేయ‌డంతో ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మందిరానికి చేరుకున్నారు. షాకైన ప్ర‌ధాన అర్చ‌కుడు రోజూ లాగే ప్ర‌ధాన అర్చ‌కుడు ఈ రోజు ఉద‌యం పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు వ‌చ్చారు. ఆలయం (Hanuman temple)లో శుభ్రపరిచే సమయంలో మాంసపు ముక్కలు కనిపించాయి. దీంతో ఆయ‌న తీవ్రంగా షాక‌య్యారు. వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించమని కోరారు. ఈ వార్త ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఇతర భక్తులకు చేరింది. కొద్ది నిమిషాల్లోనే స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి...
Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..
Crime

Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..

Maha Kumbh Fire : యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభామేళా ప‌రిస‌రాల్లో మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ (Mahakumbh Nagar)లోని ఓ శిబిరంలో ఈ రోజు ఉద‌యం ఇది సంభ‌వించింది. అప్ర‌మ‌త్త‌మైన అగ్నిమాక సిబ్బంది బాగా శ్ర‌మ‌కోర్చి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగ‌డం, చుట్టూ ఉన్న ఇతర శిబిరాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అల‌ర్ట్ అయ్యారు. ఎక్కడ జరిగింది ఈ ప్రమాదం? మ‌హా కుంభ్‌న‌గ‌ర్ (Mahakumbh Nagar) లోని సెక్టార్ 18-19 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో మేళా ప్రాంగణంలోని అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణ నష్టం ఏమైనా జ‌రిగిందా? అనే విషయమై అధికారిక సమాచారం అందలేదు. Maha Kumbh Fire కు కారణం ఏమిటి? అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ మేళాల...
K P Choudhary | సినీ నిర్మాత కె.పి. చౌదరి ఆత్మహత్య.. కార‌ణం ఏమిటంటే..!
Cinema, Crime

K P Choudhary | సినీ నిర్మాత కె.పి. చౌదరి ఆత్మహత్య.. కార‌ణం ఏమిటంటే..!

Film Producer Suicide : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె.పి. చౌదరి (Telugu film producer K P Choudhary) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. గోవాలోని సియోలిమ్ గ్రామంలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. త‌న ఆత్మ‌హ‌త్య (suicide)కు ఎవ‌రూ బాధ్యులు కార‌ని, కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెష‌న్ (depression) లో ఉన్నాన‌ని సూసైడ్‌నోట్‌లో చౌద‌రి పేర్కొన్నారు. త‌న మృత‌దేహాన్ని తమిళ‌నాడులో ఉంటున్న త‌న త‌ల్లికి అప్ప‌జెప్పాల‌ని కోరారు. కె.పి.చౌద‌రి ఆత్మ‌హత్య చేసుకున్నార‌నే వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్త‌మవుతోంది. సినీ పరిశ్రమలో ప్ర‌త్యేక గుర్తింపు కె.పి. చౌదరి (44) సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. రజనీకాంత్ (Rajinikanth) నటించిన "కబాలి" చిత్రాన్ని ఆయ‌న తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన...
Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు
World, Crime

Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు

ఉన్న‌త చదువులు, బ‌తుకుదెరువు కోసం విదేశాల‌కు వెళ్తున్న తెలుగు యువ‌కులు త‌ర‌చూ అనేక దుర్ఘ‌ట‌న (Tragic incident)ల‌కు గుర‌వుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. జీవితంలో బాగుప‌డ‌తామ‌ని దేశం కాని దేశానికి వెళ్తున్న త‌మ బిడ్డ‌లు విగ‌త‌జీవులుగా మార‌డంతో వారి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇటీవల ఐర్లాండ్ (Ireland)లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, హైద‌రాబాద్‌కు చెందిన ఒక యువ‌కుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. ఐర్లాండ్‌లో గుంటూరు యువ‌కులు ఐర్లాండ్‌లోని కార్లో కౌంటీలోని N80 రహదారిపై గ్రైగ్యూనస్పిడోజ్ ప్రాంతంలో 2025 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 1:15 గంటలకు ఒక కారు అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గ‌వ్ చిట్టూరి (23), సురేష్ చెరుకూరి (24) మృతి చెందార...
Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..
Crime

Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..

Hyderabad : ఆక‌లితో అల‌మ‌టించిందామె. క‌నీసం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఒక పూట‌ తిండి అయినా పెట్టలేకపోయింది. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు.. ఎవ‌రినైనా డ‌బ్బులు అడ‌గాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఇస్తారో.. ఇవ్వ‌రో అనేది అనుమానమే. దీంతో మాన‌సికంగా కుంగిపోయిన ఆమె ఆక‌లిని త‌ట్టుకోలేక అస్వ‌స్థ‌త‌కు గురైంది. చివ‌ర‌కు నిద్ర‌లోనే తుది శ్వాస విడిచింది. త‌ల్లి మృతితో ఏం చేయాలో ఆమె కూతుళ్ల‌కు తోచ‌లేదు. ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు ఆ అమాయ‌క పిల్ల‌లు. తొమ్మ‌ది రోజుల‌పాటు ఆక‌లితో అల‌మ‌టిస్తూ త‌ల్లి శ‌వంతోనే ఉన్నారు. హైద‌రాబాద్‌లో చోటుచేసుకున్న ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క‌ష్టాలు ఎదుర‌య్యాయి ఇలా.. Hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజు, లలిత (45) భార్యాభ‌ర్త‌లు. వీరికి ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లోనే ఈ కుటుంబం నివ‌సించేది...
error: Content is protected !!