Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది..?
Ahmedabad | గుజరాత్ లోని ఎయిర్ పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash ) యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సుమారు 250 మంది ప్రయాణికులతో గురువారం లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఫ్లైట్ నెంబర్ ఏఐ171 విమానం 242 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లడానికి అహ్మదాబాద్ ఎయిర్ ఫోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. ఎప్పటిలాగే ఏఐ 171 విమానంగాలి లోకి ఎగిరే ముందు అన్ని సాంకేతిక సమస్యలను తనిఖీ చేసుకున్నాకే టెకాఫ్ అయింది . అయితే రన్ వే నుంచి టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది . మేఘాని నగర్ గోడసర్ క్యాంప్ ప్రాంతాలయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున పేలుడు శబ్దం తోపాటు దట్టమైన పొగ అలుముకుంది సుమారు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం...




