Sarkar Live

Crime

ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..
Crime

ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..

ACB | రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజలను లంచాలతో పీడిస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఇస్తే చాలు ఇట్టే వాలిపోతున్నారు ఏసీబీ అధికారులు.. పక్కాగా వల పన్ని లంచావతారులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మే29న లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలం ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ (RI) ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. సర్వే నంబర్‌ 355లో ఏడు గుంటల భూమిని నమోదు చేసేందుకు ఆర్‌ఐ కృష్ణ ఏకంగా రూ.12లక్షల లంచం ఇవ్వాల‌ని ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివ‌ర‌కు రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్...
ACB Raids | ఏసీబీ వలలో ఖ‌మ్మం రూర‌ల్‌ సబ్ రిజిస్ట్రార్
Crime

ACB Raids | ఏసీబీ వలలో ఖ‌మ్మం రూర‌ల్‌ సబ్ రిజిస్ట్రార్

ACB Raids | భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అరుణను ఏసీబీ అధికారులు వలవేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.2వేల గజాలు తన కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ కోసం సబ్ రిజిస్టర్ అరుణ ను ఆశ్రయించాడు. ఇందుకోసం స‌ద‌రు స‌బ్ రిజిస్ట్రార్ రూ. 50వేలు డిమాండ్ చేసింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాకుమెంట్స్ రైటర్ పి.వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం రిజిస్ట్రేషన్ చేసేందుకు డాకుమెంట్స్ రైటర్ వెంకటేశ్వర రావు ద్వారా రూ.30 వేలు ఇస్తుండగా గా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు (ACB Raids) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత 9 నెలల క్రితమే స...
ACB Raids | రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు లంచావతారుల అరెస్టు..
Crime

ACB Raids | రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు లంచావతారుల అరెస్టు..

ACB Raids in Telangana | ఏసీబీ అధికారులు అక్రమార్కల భరతం పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు లంచావతారులను పట్టుకున్న ఏసీబీ (Telangana ACB) తాజాగా శనివారం మరో ఇద్దరు అవినీతి అధికారులను అరెస్టు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాండ్ బాజా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కొన్ని రోజుల క్రితం జగద్గిరిగుట్ట పీఎస్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్సై శంకర్ కేసు నమోదు చేశాడు. అయితే ఎస్ఐ కె.శంకర్ ఫిర్యాదుదారుడి వాహనం, DJ సిస్టమ్ ను తిరిగి ఇచ్చేందుకు గాను ఫిర్యాదుదారుడి నుంచి ₹15,000/- లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అయితే కేసు నమోదు తర్వాత డీజేకు సంబంధించిన సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామగ్రిని తిరిగి ఇచ్చేందుకు గాను కేసు నమోదైన వ్యక్తి నుంచి ఎస్సై శంకర్ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో ...
ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి
Crime

ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి

అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావును విచారిస్తున్న అధికారులు Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు (ACB Raids) నిర్వహించారు. బిల్లింగ్ అనుమతి కోసం ఏకంగా రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. విఠల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విఠల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.8 లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. రూ.4 లక్షలు తీసుకుని మరో రూ.4 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సికింద్రాబాద్​ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​ విఠల్ రావు.. రెండు బిల్డింగ్​ల నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ. 8 లక్షలు డిమాండ్​ చేశారు. మొదటి విడతలో 4ల...
Bribe | ఏసీబీ వలలో కానిస్టేబుల్, అసిస్టెంట్ పీపీ
Crime

Bribe | ఏసీబీ వలలో కానిస్టేబుల్, అసిస్టెంట్ పీపీ

Kamareddy : కామారెడ్డిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివ రామ్ నాయక్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 లంచం (Bribe) డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 420 కింద నమోదు చేయబడిన చీటింగ్ కేసుకు సంబంధించిన క్రైమ్ నంబర్ 375/2018 ప్రకారం ఫిర్యాదుదారునిపై కేసు విచారణ త్వరగా పూర్తి చేయడానికి, కేసులో నిర్దోషిగా విడుదల చేయడానికి అనుకూలంగా వ్యవహరించినందుకు సంజయ్ ద్వారా లంచం తీసుకున్నారు. మొదట్లో నాయక్ రూ.15,000 లంచం డిమాండ్ చేయగా, చివరకు రూ.10,000కి వీరి మధ్య ఒప్పందం కుదిరింది. సంజయ్ వద్ద నుంచి ACB అధికారులు రూ.10,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్...
error: Content is protected !!