ACB | ఏసీబీకి చిక్కిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
వరంగల్ : ములుగు జిల్లా (Mulugu District) లోని జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొన్ను సౌమ్యను తెలంగాణ ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడి వైద్య సెలవు కోసం జీత బిల్లులను సిద్ధం చేయడానికి, ములుగు జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సమర్పించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కగా వలపన్ని అవినీతికి పాల్పడిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాకర్ ను అలాగే జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను పట్టుకున్నారు.
ఇదిలా ఉండగా సోమవారం వికారాబాద్ (Vikarabad) జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ - టి. శ్రీధర్ ను ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. , "ఫిర్యాదిదారుడి టి.ఎ. బిల్లును ప్రాసెస్ చేయడ...




