Sarkar Live

Crime

Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం
Crime

Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం

మహారాష్ట్ర (Maharashtra)లోని బండారా (Bhandara) జిల్లాలో ఉన్న‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇవాళ జ‌రిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్ తీవ్రంగా దెబ్బతింది. పేలుడు (Explosion) తీవ్రతకు పకప్పు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 12 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగతా 10 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో యంత్రాంగం ఘటన స్థలానికి భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలించాయి. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం (SDRF) సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు ఉపయోగించి దెబ్బతిన...
Police Encounter : ఎన్‌కౌంటర్‌ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో సహా నలుగురు హతం..
Crime

Police Encounter : ఎన్‌కౌంటర్‌ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో సహా నలుగురు హతం..

UP Police Encounter News : ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF )తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుడితోపాటు అతని ముగ్గురు స‌హ‌చ‌రులు హ‌త‌మ‌య్యారు. సద‌రు గ్యాంస్ట‌ర్ పై ఇప్ప‌టికే లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ మేరకు మంగళవారం అధికారులు మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి షామ్లీలోని జింఝానా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక STF ఇన్‌స్పెక్టర్‌కు కూడా అనేక బుల్లెట్‌లు తగిలి గాయాల‌పాల‌య్యారు. STF అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) అమితాబ్ యాష్ ఒక ప్రకటనలో, "సోమవారం అర్ద‌రాత్రి,STF మీరట్ బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో, ముస్తఫా కగ్గా గ్యాంగ్ సభ్యుడు అర్షద్‌తోపాటు అతని ఇతర ముగ్గురు సహచరులు మంజీత్, సతీష్, మ‌రో గుర్తు తెలియ‌ని మృతిచెందారు. అడిష‌న‌ల్ డిజిపి అమితాబ్ యష్ మాట్లాడుతూ, “సహారన్‌పూర్‌లోని బెహత్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ...
Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం వేళ క‌ల‌క‌లం
World, Crime

Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం వేళ క‌ల‌క‌లం

Firing in America : అమెరికా (United States)లో మ‌రో ఘోరం జ‌రిగింది. దుండుగుల దాడిలో మరో తెలుగు విద్యార్థి బ‌ల‌య్యాడు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఈ ఘ‌ట‌న ఇవాల‌ చోటుచేసుకుంది. షింగ్టన్ డిసి(Washington DC)లో భారీ బందోబస్తు ఉన్న‌ సమయంలోనే హైద‌రాబాద్‌కు చెందిన యువ‌కుడిపై దుండ‌గులు కాల్పులు జ‌రప‌డం క‌ల‌క‌లం రేపింది. స్థిర ప‌డ‌తాడ‌ని అనుకుంటే.. హైదరాబాద్‌ చైతన్యపురి ప్రాంతానికి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవి తేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ కొడుకు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడతాడని తల్లి దండ్రులు ఆశించగా ఈ ఘ‌ట‌న వారిని తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వాషింగ్టన్‌లో దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందాడ‌ని తెల‌వ‌డంతో ఆ కుటుంబ స‌భ్యుల‌తోపాటు బంధుమిత్రులు దిగ...
Sharon Raj murder case : ప్రియుడి హ‌త్య కేసులో ప్రియురాలికి ఉరి శిక్ష.. కోర్టు సంచ‌ల‌న తీర్పు
Crime

Sharon Raj murder case : ప్రియుడి హ‌త్య కేసులో ప్రియురాలికి ఉరి శిక్ష.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

Kerala Sharon Raj murder case : కేర‌ళ‌లో మూడేళ్ల క్రితం చోటు చేసుకున్న హ‌త్య కేసులో తీర్పు వెలువ‌డింది. ప్రియుడిని అంతం చేసిన ప్రియురాలికి ఉరి శిక్ష ఖరారైంది. తిరువనంతపురం నెయ్యట్టికార అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.బషీర్ ఈరోజు తీర్పును వెలువ‌రించారు. ప్రియుడు ష‌రోన్‌రాజ్‌ను హ‌త్య చేసిన గ్రీష్మ‌కు ఉరిశిక్ష విధించారు. మ‌రో ప్ర‌ధాన నిందితుడైన ఆమె మేన‌మామ నిర్మ‌ల్ కుమార‌న్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది. ముందు ప్రేమ.. ఆ త‌ర్వాత ప‌గ‌ షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ చదువుకుంటున్నప్పుడు గ్రీష్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య‌ ఏడాది పాటు రిలేషన్‌షిప్ కొనసాగింది. అయితే.. గ్రీష్మ కుటుంబం వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో బ్రేకప్ చేసుకుందామ‌ని గ్రీష్మ కోర‌గా ష‌రోన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో తన తల్లి, మేనమామ సహ‌కారంతో అత‌డిని హత్య చేస...
Prayagraj Kumbh Mela : కుంభ‌మేళాలో సిలిండ‌ర్ పేలి మంట‌లు..
Crime

Prayagraj Kumbh Mela : కుంభ‌మేళాలో సిలిండ‌ర్ పేలి మంట‌లు..

Fire Accident in Prayagraj Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఉత్స‌వానికి హాజరైన ల‌క్ష‌లాది మంది జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అధికారులు హుటాహుటిన‌ స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ స‌మ్మేళ‌నమైన మహా కుంభమేళాలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడం ప్రారంభించడంతో, అనేక వాన్టేజ్ పాయింట్ల నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోందని, వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అలారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన‌ అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు, పరిస్థితిని చూసి స్థానిక అధికారులు సిబ్బంది ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. పెద్ద పెద్ద ద‌ట్ట‌మైన‌ పొగ మేఘాలు ...
error: Content is protected !!