Corruption | సర్జరీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ వైద్యుడు..
Karnataka - Chikkaballapura | కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక సర్జన్ (Government Doctor) శస్త్రచికిత్స కోసం రోగుల నుంచి లంచం (Corruption) డిమాండ్ చేయడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. డాక్టర్ నరసింహమూర్తి, రోగుల నుంచి శస్త్రచికిత్స చేయడానికి గాను వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చూపించిన ఒక వీడియోను జూన్ 11న స్థానిక టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం కావడంతో అది వైరల్ గా మారింది. ఆ వీడియో ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆరోగ్య శాఖ, ప్రభుత్వ అధికారులను ఇరుకునపెట్టింది.
డిపార్ట్మెంట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. లంచం డిమాండ్ చేసిన డాక్టర్ నరసింహమూర్తి ఆగస్టు 2019 నుంచి గుడిబండే పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ఇన్ఛార్జ్ తాలూకా ఆరోగ్య అధికారిగా ఉన్నారు. ఆయన సస్పెన్షన్కు గురయ్యే సమయానికి సుమారు ఐదేళ్ల పది నెలలు ఆ పదవిలో ఉన్...