Sarkar Live

Crime

Mahabubnagar : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువ‌కుడు మృతి
Crime

Mahabubnagar : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువ‌కుడు మృతి

Mahabubnagar : అమెరికా (United States)లో జరిగిన ఓ ఘ‌ట‌న‌లో మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన యువకుడు పోలీసుల కాల్పుల కు గురై ప్రాణాలు (shot dead) కోల్పోయాడు. 15 రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినప్పటికీ అతడి స్నేహితులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది.మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ (34) 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. చదువులు పూర్తయ్యాక కాలిఫోర్నియా (California)లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నలుగురితో క‌లిసి ఓ రూమ్‌ను అద్దెకు తీసుకొని నివ‌సిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రూమ్‌మేట్స్‌తో విభేదాలు ఉధృతమై చివరికి ప్రాణాంతక పరిణామానికి దారితీశాయి. రూమ్‌మేట్స్‌తో వాగ్వాదం.. పోలీసుల కాల్పులు కాలిఫోర్నియా (California) మీడియా కథనాల ప్రకారం.. నిజాముద్దీన్, అతడి రూమ్‌మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జ...
Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు
Crime

Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు

Wanaparthy District : మ‌రో ఇద్ద‌రు అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారుల‌కు చిక్కారు. వ‌న‌ప‌ర్తి జిల్లా (Wanaparthy) కొత్తకోట మండలం నీర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు ఇనాం భూముల ఓఆర్సీ కోసం ఆర్డీవో (RDO)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆర్డీఓ కొత్తకోట ఎమ్మార్వోకు పంపారు. దీంతో తహసీల్దార్ ఇనాం భూములకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఎమ్మారై వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్ద‌రు సదరు రైతు నుంచి రూ.40 వేలు ఇస్తేనే ప‌నిచేసి పెడ‌తామ‌ని చెప్పారు. స‌ద‌రు రైతు అంత‌పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇవ్వ‌లేని మొర‌పెట్టుకున్నా వారు విన‌లేదు.దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంట‌నే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి డిమాండ్‌ చేసినట్లు ఆధారాలను సే...
ACB raid | ఏసీబీకి చిక్కిన‌ అవినీతి అధికారులు – తహసీల్దార్‌తో పాటు ఇద్దరికి అరెస్ట్
Crime, Khammmam

ACB raid | ఏసీబీకి చిక్కిన‌ అవినీతి అధికారులు – తహసీల్దార్‌తో పాటు ఇద్దరికి అరెస్ట్

Khammam News | ఖ‌మ్మం జిల్లాలో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి (ACB raid) చిక్కారు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ తల్లడ( Tallada) మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్ తహసీల్‌ కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తల్లడ తహసీల్దార్‌ కార్యాలయానికి వ‌చ్చిన బాధితుడిని అధికారులు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం తహసీల్‌ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేషర్‌ శివాజీ రాథోడ్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న తహసీల్దార్‌ వంకాయల సురేష్‌కుమార్ (Tahasildar) ‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మాలోత్‌ భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరిని వరంగల్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశప్టెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు విచార‌ణ చేప‌...
Digital arrest | ప్రాణాలు బ‌లిగొన్న సైబ‌ర్‌నేర‌గాళ్లు.. రిటైర్డ్ డాక్ట‌ర్ మృతి
Crime

Digital arrest | ప్రాణాలు బ‌లిగొన్న సైబ‌ర్‌నేర‌గాళ్లు.. రిటైర్డ్ డాక్ట‌ర్ మృతి

Digital arrest in Hyderabad : ఆమె ప్రభుత్వ వైద్యురాలిగా (Retired doctor ప‌నిచేసింది.. శారీర‌క, మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు చికిత్స చేసింది. రోగుల‌కు మందుల‌తోపాటు మ‌నోధైర్యాన్ని నూరిపోసి ప్రాణాల‌ను కాపాడింది. ఎలాంటి సంద‌ర్భాల్లోనైనా గుండె నిబ్బ‌రం చేసుకోవాలని చెప్పిన ఆమె.. చివ‌రిగా సైబ‌ర్ నేరగాళ్ల ఉచ్చులో ప‌డి భ‌యాందోళ‌న‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. హైద‌రాబాద్ (Hyderabad)లో చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చి తీవ్ర క‌ల‌క‌లం రేపింది. సైబర్ మోసగాళ్లు (cyber fraudsters) ఎంత దారుణంగా, ఎంత కర్కశంగా అమాయ‌కుల‌ను వలలోకి దింపుతున్నారో ఇది గుర్తుచేసింది. Digital arrest : 70 గంట‌లపాటు వేధించి.. బాధితురాలు (76) రిటైర్డ్ వైద్యురాలు. సాధారణంగా తన పింఛను మీద ఆధారపడుతూ ప్రశాంత జీవితం గడుపుతోంది. సెప్టెంబ‌రు 6న ఆమెకు ఓ ఫోన్‌కాల్ వ‌చ్చింది. లిఫ్టు చేసిన వెంటనే అవ‌తలి వ్య‌క్తులు త‌మ‌ను తాము పోలీ...
Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు
Crime

Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు

ప‌దేళ్ల బాలికపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన వృద్దుడికి 24 ఏళ్ల జైలు Nalgonda News | అభంశుభం తెలియ‌ని ప‌దేళ్ల బాలిక‌పై పాశ‌వికంగా లైంగిక దాడికి పాల్ప‌డిన కామాంధుడైన‌ వృద్ధుడు నల్లగొండ (Nalgonda ) మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య (60)కు పోక్సో కోర్టు (POCSO Court) 24ఏళ్ల జైలు శిక్ష (24 Years Jail Sentence) విధించింది. ఈ కేసు పూర్వ‌ప‌రాల్లోకి వెళితే.. 2023 మార్చి 28న నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ బాలిక బడికి వెళ్లి ఇంటికి వ‌చ్చి నిద్రపోతున్న సమయంలో ఊష‌య్య అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి బాలిక‌కు తిను బండారాలు ఇచ్చి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఎవరికైనా చెప్పితే చంపేస్తాన‌ని బాలిక‌ను బెదిరించారు. విషయం తెలుసుకున్న‌ బాధితురాలి తల్లి 2023 మార్చి 29న‌ నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ( SHO) కంచర్ల భాస్కర్ రెడ్డి నిందితుడు ఊష‌య్య‌పై...
error: Content is protected !!