Andesri | తెలంగాణ ఆత్మకు స్వరమిచ్చిన ప్రజాకవి
“జయ జయహే తెలంగాణ”తో చరిత్రలో చిరస్మరణీయం
గొర్ల కాపరి నుంచి కవి వరకు… అనాథ నుంచి డాక్టరేట్ వరకు — అందెశ్రీ ప్రయాణం ఇదే!
Andesri | తెలంగాణ ఆత్మకు కవిత్వం రాసిన గొప్ప కవి అందెశ్రీ (64) ఇక లేరు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన ఆయనను కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కష్టాలతో నిండిన బాల్యం
సిద్దిపేట జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందె ఎల్లయ్య, సాహిత్య ప్రపంచంలో “అందెశ్రీ”గా పేరు తెచ్చుకున్నారు. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని స్థితిలో, అనాథగా పెరిగిన ఆయన కొన్నేళ్లు గొర్రెల కాపరిగా జీవించారు. అయితే అదే సమయం ఆయనలో కవిత్వానికి అంకురార్పణ జరిగిందని తరచుగా చెప్పేవారు.
అందెశ్రీ (Andesri) పాఠశాలకు వెళ్లలేదు. ఎలాంటి చదువు లేకపోయినా, తన కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై అసాధారణమైన పట్టు సాధించారు. ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం ...


