Sarkar Live

National

Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం
National

Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం

Centre to help red chilli farmers : ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల (chilli farmers)కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. మార్కెట్‌లో ధ‌ర పడిపోతున్న దృష్ట్యా వారికి బాస‌ట‌గా నిలిచేందుకు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థన మేర‌కు కేంద్రం మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీం (MIS) ద్వారా మ‌ద్ద‌తు ధ‌ర కల్పించ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్ (Union Agriculture Minister Shivraj Singh Chouhan) ప్ర‌క‌టించారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూల స్పందన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిర్చి రైతుల (chilli farmers) కు స‌హాయం అందించాల‌ని కేంద్రాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) కోరారు. ఈ క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్‌తో చ‌ర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏపీ రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ...
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?
National

Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?

Rekha Gupta : ఢిల్లీ బీజేపీ తొలి ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. చారిత్రిక రాంలీల మైదానం (Ramlila Ground) ఈ మ‌హోత్స‌వం జ‌రిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ ఇత‌ర అగ్ర‌నేత‌లు, ఎన్డీయే ముఖ్య‌నేత‌ల స‌మ‌క్షంలో రేఖా గుప్తా (Rekha Gupta) ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఏన్డీయే ఏకైక సీఎం Rekha Gupta రేఖా గుప్తా ఢిల్లీలో నాలుగో మహిళా ముఖ్యమంత్రి. ఎన్డీయే కూట‌మిలో ముఖ్య‌మంత్రుల బృందం (NDA chief ministers)లో ఆమె ఏకైక సీఎం. 50 ఏళ్ల రేఖా గుప్తా షాలిమార్‌బాగ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పార్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో పాటు మహారాష్ట్ర ముఖ్యమ...
Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు
National, World

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట ప‌ర్చేలా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. Amir of Qatar visit : స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోదీ ఈ సమావేశానికి ముందు ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో గౌర‌వ వంద‌నం ల‌భించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాధారణంగా విదేశీ నేతలను స్వాగతించడం కోసం ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమైన అధికారులు లేదా మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే.. ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ఖతార్ అమీర్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. తన సోదరుడికి స్వాగతం పలుకుతున్నానని, ఆయన భారత ప...
FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..
National

FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..

FASTag New Rules : జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఫాస్టాగ్ వ్యవస్థను ప్ర‌వేశ‌పెట్టిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఓ రూల్‌ను తీసుకొచ్చింది. ఫాస్టాగ్ (FASTag) బ్లాక్ లిస్టులోకి వెళ్లినప్పుడు వినియోగ‌దారులు రెట్టింపు చార్జ‌లు చెల్లించాలని నిబంధ‌న‌ను విధించింది. ఇది ఈరోజు (2025 ఫిబ్ర‌వ‌రి 17) నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. FASTag New Rules 2025 : పాటించ‌కుంటే డ‌బుల్‌ వ‌డ్డింపు సాధార‌ణంగా తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయకపోవడం, లేదా వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. తద్వారా టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద చెల్లింపులు జ‌ర‌గ‌వు. NPCI తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. బ్లాక్ లిస్టులోకి వెళ్లిన వినియోగదారులు 70 నిమిషాల వ్యవధిలో త‌మ ఫ...
Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?
National

Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?

Strong earthquake In Delhi | దేశ‌ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉండగా 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0గా దీని తీవ్ర‌త నమోదైంది. జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (National Center for Seismology - NCS) ప్రకారం భూకంపం 28.59 ఉత్తర అక్షాంశం (latitude), 77.16 తూర్పు రేఖాంశం (longitude) వద్ద రికార్డ‌య్యింది. ఈ భూకంపం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉద్భవించింది. Strong earthquake : ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఈ భూకంపం తీవ్ర‌త ఢిల్లీ నగరంతోపాటు నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం ఐదారు సెకన్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ దాని తీవ్రత ప్రజలను ఉలికిపడేలా చేసి...
error: Content is protected !!