Sarkar Live

National

Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం
National

Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం

Waqf Amendment Bill : వ‌క్ఫ్‌ సవరణ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను స‌మ‌ర్పించ‌గా సభ (Rajya Sabha)లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము క‌మిటీ ఎదుట వ్య‌క్త‌ప‌రిచిన అభ్యంత‌రాల‌ను జేపీసీ నివేదిక నుంచి తొల‌గించార‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని కాంగ్రెస్ మండిప‌డింది. దీన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజిజు (Kiren Rijiju) ఖండించారు. జేపీసీ (joint committee of Parliament) నివేదిక నుంచి ఏ భాగం కూడా తొల‌గించ‌లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నార‌ని అన్నారు. ఇరుప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం ప్ర‌తిప‌క్ష నేత‌ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (Mallikarjun Kharge) రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికలో అనేక మంది సభ్యులు తమ అభ్యంత‌రాల‌ను వ్య‌క్...
Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు
National

Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు

New Delhi : ఎన్నికలకు ముందు " ఉచిత బహుమతులు (Freebies ) " ప్రకటించే పార్టీలపై భారత సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా మండిపడింది . ఇటువంటి పథకాలు తరచుగా ప్రజలను పని చేయకుండా చేస్తాయ‌ని, దేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు కాకుండా అడ్డుకుంటాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని సుప్రీంకోర్టు ఖండిస్తూ, ఉచిత రేషన్, డబ్బు లభిస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. నైట్ షెల్టర్లకు సంబంధించిన కేసును విచారిస్తూ జస్టిస్ బిఆర్ గవై, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేసిన తాజా వ్యాఖ్యలు అంద‌రిన్నీ ఆలోచింప‌జేస్తున్నాయి."దురదృష్టవశాత్తు, ఈ ఉచితాల కారణంగా… ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు అందుతున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే న‌గ‌దు పొందుతున్నారు" అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. Freebies తో ప‌రాన్న జీవుల‌ను సృష్టిస్తున్నా...
Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు
National

Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు

Prayagraj Mahakumbh 2025 | మహాకుంభ మేళా 2025 యావ‌త్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో, అద్భుత‌మైన‌ ఏర్పాట్లు దీనిని అతిపెద్ద, ఉత్తమమైన ఆధ్యాత్మిక సమ్మేళ‌నంగా మార్చాయి. సాధారణ భక్తుల నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు, వీవీఐపీల వరకు - సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి పోటెత్తుతున్నారు. కాగా, మహాకుంభ్-2025 కింద బుధవారం జరిగే నాల్గవ స్నానోత్సవం మాఘ పూర్ణిమ (Magh Purnima Snan Parv) ను విజయవంతంగా నిర్వహించేందుకు యోగి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళా ప్రాంతంలో లేదా ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరమంతటా భక్తులు, సాధారణ పౌరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా, స్థానిక పరిపాలన, పోలీసు శాఖ పూర్తి సంసిద్ధతతో పనిచేస్తున్నాయి, ట్రాఫిక్ నిర్వహణ, సజావుగా ...
Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..
National

Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..

Adani's indictment : భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చింద‌నే ఆరోప‌ణ‌లు మ‌ళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌర‌శ‌క్తి ఒప్పందాల కోసం భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్ట‌జెప్పింద‌ని, వాటి చెల్లింపులు అమెరికా పెట్ట‌బడిదారుల నుంచి జ‌ర‌గాయ‌ని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ (Attorney General)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పామెలా బేడీకి అక్క‌డి కాంగ్రెస్ స‌భ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్ ఫాలన్, మైక్ హారిడోపోలస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్. టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ లేఖ రాశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ (DOJ) అభియోగాలు రాజకీయ ప్రేరితమైనవేనా? అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్త‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదైనా కుట్ర కోణం ఉందా? భారత ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందా? అమెరికా న్యాయశాఖ (US Departme...
Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?
National

Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?

Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ విజయం సాధించింది .70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి.. 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Pravesh Verma), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ను 4,089 ఓట్ల తేడాతో ఓడించడంతో దేశ రాజకీయాల్లో ఆయన ఇపుడు పాపులర్ అయ్యారు.. న్యూఢిల్లీ సీటును బిజెపి (BJP) తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి గెలుచుకున్న పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించిన తర్వాత, ప్రవేశ్ వర్మ అభ్యర్థిత్వం మరింత బలపడింది. అయితే, బిజెపి అగ్ర నాయకత్వం తన నిర్ణయాలతో చాలాసార్లు ఆశ్చర్యపరిచినందున, ప్రవేశ్ వర్మ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం చాలా తొందపాటవుతుంది. ...
error: Content is protected !!