LK Advani | ఐసీయూలో అధ్వానీ.. మళ్లీ ఆస్పత్రిలో చేరిన దిగ్గజ నేత
LK Advani : మాజీ ఉప ప్రధాని, బీజేపీ విశ్రాంత దిగ్గజ నేత ఎల్.కె. అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital) ఐసీయూలో ఆయన శనివారం చేరారు. అద్వానీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. న్యూరాలజీ విభాగానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే.. ఈసారి ఆస్పత్రిలో చేరడానికి కారణం ఇంకా వెల్లడికాలేదు.
ఇదే ఆస్పత్రిలో అద్వానీ చేరడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది తొలిరోజుల్లో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆతర్వాత జూలైలో కూడా అద్వానీ ఇదే ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. అలాగే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆగస్టులో ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పుడు కూడా ఆ హాస్పిటల్ ప్రత్యే...




