Sarkar Live

National

Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం
National

Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం

Financial benefits to Congress from a foreign organization : విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఆ పార్టీలో ప్రకంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి. జార్ట్ సోరోస్ ఫౌండేష‌న్ నిధుల‌తో న‌డిచే సంస్థ‌తో సోనియాగాంధీ సత్సంబంధాలు క‌లిగి ఉన్నార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని తేట‌తెల్ల‌మైంద‌ని విమ‌ర్శిస్తోంది. దీన్ని కాంగ్రెస్‌తోపాటే అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు తోసిపుచ్చారు. దీన్ని కూడా బీజేపీ త‌ప్పుప‌డుతోంది. విప‌క్షాలతో క‌లిసి భార‌త్‌ను అస్థిర ప‌ర్చేందుకు విదేశీయులు కుట్ర ప‌న్నుతున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అభివ‌ర్ణించింది. కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ...
Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. రాజధానిలో కలకలం
National

Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. రాజధానిలో కలకలం

Delhi School Bomb Threats : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ప‌లు స్కూళ్ల‌కు వ‌రుస‌గా బాంబు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని మదర్ మేరీస్ స్కూల్, బ్రిటిష్ స్కూల్, సాల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌తో సహా పలు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. ఆర్‌కే పురంలో ఒకటి, పశ్చిమ విహార్‌లోని రెండు పాఠశాలలకు హెచ్చరికలు అందాయని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న తర్వాత, రెండు పాఠశాలల నిర్వాహకులు పిల్లలను వారి ఇళ్లకు తిరిగి పంపించేశారు. డీపీఎస్ ఆర్కే పురం నుంచి ఉదయం 7.06 గంటలకు, జీడీ గోయెంకా పశ్చిమ్ విహార్ నుంచి ఉదయం 6.15 గంటలకు బాంబు బెదిరింపులు వచ్చాయని డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు. అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసులు హుటాహుటిన‌ పాఠశాలలకు చేరుకుని సోదాలు నిర్వహి...
రేపటి నుంచి నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్స్ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
National

రేపటి నుంచి నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్స్ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Army Agniveer Recruitment Rally | హైదరాబాద్: తెలంగాణ నుంచి అగ్నివీర్ నియామ‌కాల కోసం ఇండియ‌న్ ఆర్మీ డిసెంబర్ 8 నుంచి 16 వరకు గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించ‌నుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, , పుదుచ్చేరి లోని మహిళా మిలిటరీ పోలీసుల (డబ్ల్యుఎంపి)ని కూడా ఎంపిక చేసేందుకు ర్యాలీ నిర్వహించనున్నారు. . పోస్టుల వివ‌రాలు అభ్యర్థులు అగ్నివీర్- జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (X క్లాస్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (తరగతి VIII పాస్) అగ్నివీర్​ జనరల్​ డ్యూటీ, అగ్నివీర్​ టెక్నికల్​, అగ్నివీర్​ క్లర్క్​/స్టోర్​ కీపర్ ఉద్యోగాలకు అభ్య‌ర్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక అగ్నివీర్​ ట్రెడ్స్​ మెన్​కు కేవ‌లం 8వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. ర్య...
Farmers Protest Updates | నేడు రైతుల పాదయాత్ర..  ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..
National

Farmers Protest Updates | నేడు రైతుల పాదయాత్ర.. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..

Farmers Protest Updates :  రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో నగర సరిహద్దుల వద్ద ప్రభుత్వం బారీ భద్రతను పెంచింది. తమ డిమాండ్ల కోసం రైతులు నేటి మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుండి ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతుల నిరసనలు నేటికీ కొనసాగుతున్నాయి, అలాగే రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ప్రకారం, 101 మంది రైతులతో కూడిన 'జాతా' ఈ రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుంచి దేశ రాజధాని వైపు కదులుతుంది. . ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. 101 మంది రైతులతో 'మర్జీవ్దా జాతా' పేరుతో పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి ఢిల్లీకి మార్చ్‌గా బయలుదేరుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో రైతు నాయకుడు సర్వన్ సింగ్ ...
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక
National

Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక

Devendra Fadnavis | మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు 12 రోజుల తర్వాత తెర‌ప‌డింది. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం డిసెంబర్ 5న ఆయన మూడోసారి మహారాష్ట్ర సీఎం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఫడ్నవీస్ పాల్గొన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మ‌లా సీతారామన్, రూపానీని బిజెపి నియమించిన విష‌యం తెలిసిందే.. అయితే శాసనసభా పక్ష సమావేశానికి ముందు, బిజెపి నేత‌ సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలుస్తాయ‌ని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20 న జ...
error: Content is protected !!