IMD Alert | వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు – దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ అలర్ట్
                    పలు రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్
IMD Alert | దేశవ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్టాల్రకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ (IMD Alert) చేసింది. తెలంగాణతోపాటు దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న మూడు నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దిల్లీ ప్రాంతంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 13, 14 తేదీల్లో వర్షం కారణంగా వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, లక్నో, గోరఖ్పూర్, వారణాసి, మీరట్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది...                
                
             
								



