Sarkar Live

National

Delhi Blast | ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌.. కారులో ఉన్న‌ది ఎవ‌రు?
Crime, National

Delhi Blast | ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌.. కారులో ఉన్న‌ది ఎవ‌రు?

Delhi Blast News updates : నిన్న రాత్రి దేశ రాజధానికి ఒక పీడకల. ఢిల్లీ న‌గ‌రానికి గుండెగా భావించే చాందినీ చౌక్, జనపథ్, రాజీవ్ చౌక్ వంటి ప్రాంతాలకు సమీపంలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో ఉపయోగించిన తెలుపు రంగు గ‌ల‌ హ్యుందాయ్ ఐ20 కారు పుల్వామాకు చెందిన వైద్యుడిదని దర్యాప్తు అధికారులు గుర్తించారు, దీనితో సెంట్రల్ ఢిల్లీలో జరిగిన దాడికి, అదే రోజు ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. కారులో ఉన్న‌ది ఎవ‌రు? కారు ప్రస్తుత యజమాని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. సోమవారం ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి ముందు అరెస్టు చేసిన ఇద్దరు వైద్యుల మాదిరిగానే ఆయనకు కూడా ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని ఒక సీనియర్ అధికారి జాతీయ మీడియాకు వెల్ల‌డించారు. తాజా నివేదికల ప్రకారం, పుల్వామాలోని అతని కుటుంబ సభ్యులు, అతని తల్లి, సోదరుడిని...
Train Accident | ప్యాసింజర్‌ రైలు గూడ్స్‌ రైలు ఢీ.. పలువురు మృతి
National, Crime

Train Accident | ప్యాసింజర్‌ రైలు గూడ్స్‌ రైలు ఢీ.. పలువురు మృతి

Bilaspur Train Accident | ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగ‌ళ‌వారం రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. రాయ్‌గఢ్‌ నుంచి వస్తున్న ప్యాసింజర్‌ రైలు లాల్‌ఖండ్‌ సమీపంలో నిలిచివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ బృందాల చర్యలు ప్రమాద గురించి సమాచారం అందుకున్న వెంటనే SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. బోగీలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గ్యాస్‌ కట్టర్ల సహాయంతో కోచులను కట్‌ చేస్తున్నారు. రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని బిలాస్‌పూర్ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఈ రైలు ప్రమాదంలో మహిళా కో...
Accident | మ‌రో  ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది దుర్మ‌ర‌ణం
National, Crime

Accident | మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది దుర్మ‌ర‌ణం

Jaipur road Accident | జైపూర్‌లోని హర్మాడలో సోమవారం మధ్యాహ్నం ఒక డంపర్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్​ అతివేగంగా నడుపుతూ ముందున్న అనేక వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 19 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఖాళీ డంపర్ రోడ్ నంబర్ 14 నుండి లోహా మండి పెట్రోల్ పంప్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో ఒకదాని తర్వాత ఒకటి వాహనాలను ఢీకొట్టడం ప్రారంభించింది. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక‌ ఆసుపత్రికి తరలించారు వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ఉందని, కానీ అకస్మాత్తుగా ఒక డంపర్ మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ‌రుస‌గా మూడు కిలోమీట‌ర్ల మేర ముందున్న వాహనాల‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లింద‌ని.తెలిపారు. ర...
Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
National

Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సభలు, ర్యాలీల్లో తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది. నీళ్లు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు సమావేశం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులు వివరణ ఇవ్వాలని కోరింది. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న‌టుడు విజ‌య్ పర్య‌ట‌న‌లు వాయిదా ఈ ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధ...
chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్
National

chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్

23 మంది మహిళా మావోయిస్టులు సహా 103 మంది మావోయిస్టుల లొంగుబాటు Chhattisgarh Naxal News : ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు మరో కీలక విజయం సాధించాయి. శుక్ర‌వారం 103 మంది మావోయిస్టులు పోలీసుల‌కు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ అభ‌యార‌ణ్యం మావోయిస్టుల కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన యాక్ష‌న్ ప్లాన్‌, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల ఆలోచ‌న‌ల్లో గ‌ణ‌నీయ‌మైన‌ మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్ర‌మంలోనే భారీ స్థాయిలో న‌క్స‌లైట్లు లొంగిపోతున్నారు. లొంగిపోయిన 103 మంది మావోయిస్టుల్లో 49 మందిపై రూ.1.06 కోట్లకు పైగా రివార్డు ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెప్ప‌వ‌చ్చు.లొంగుబాటుతోపాటు పునరావాసం, ప్రధాన స్రవంత...
error: Content is protected !!