KTR | హైదరాబాద్లో బీఆర్ఎస్ ‘చలో బస్భవన్’ ఆందోళన.. కేటీఆర్, హరీష్ రావు హౌస్ అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్గురువారం 'చలో బస్భవన్' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఇక, చలో బస్భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్భవన్ వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు వ...




