Sarkar Live

Hyderabad

Hydra : హైడ్రాకు కొత్తగా ప్రత్యేక పోలీస్ స్టేషన్.. మరిన్ని అధికారాలు
State, Hyderabad

Hydra : హైడ్రాకు కొత్తగా ప్రత్యేక పోలీస్ స్టేషన్.. మరిన్ని అధికారాలు

Hydra Police Station : హైదరాబాద్‌ ‌నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తూ.. నీటి వనరులను పరిరక్షిస్తూ హైస్పీడ్ తో దూసుకుపోతున్న హైడ్రా ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా (Hydra) ప్రత్యేక విభాగానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఈ క్రమంలోహైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 8వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇకపై చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములపై జరిగే అక్రమ ఆక్రమణలపై స్థానికులు లేదా అధికారులు ఫిర్యాదు చేస్తే, హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్లలోనే కేసులు నమోదవుతాయి. ఇప్పటివరకు సాధారణ పోలీస్‌ ...
TGSRTC : ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
State, Hyderabad

TGSRTC : ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

TGSRTC | హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల సౌకర్యార్థం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మెట్రో కాంబి టికెట్‌’ (metro combi ticket) ను కేవలం రూ.20 కే ప్రవేశపెడుుతున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా జనరల్ బస్ టికెట్ (GBT) మెట్రో ఎక్స్‌ప్రెస్ , సాధారణ నెలవారీ బస్ పాస్ ఉన్నవారు (Bus pass holders) హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో (Metro deluxe buses) ప్రయాణించొచ్చు. ఇప్పటికే ఉన్న నెలవారీ పాస్ హోల్డర్లకు అప్‌గ్రేడ్ చేసిన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. నామమాత్రపు అదనపు ఖర్చుతో వారు ఎక్కువ సౌకర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఆఫ ఉపయోపడుతుంది. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో డీలక్స్ సేవలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్టీసీలో సమ్మె గుబులు ఇదిలా ఉండగా, ఆర్టీసీ (TGSRTC) కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆర్టీ...
Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్
State, Hyderabad

Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్

Harish Rao : రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేశారని, ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు చెప్పేది ఇదేనా? అని ప్రశ్నించారు.విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపుల...
GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్
Hyderabad, State

GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్

Hyderabad : జిహెచ్ఎంసి (GHMC) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ (RV Karnan) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆర్.వి. కర్ణన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా నియమితులయ్యారు. బదిలీపై వెళుతున్న కమిషనర్ కె. ఇలంబర్తి నుంచి ఆర్వి కర్ణన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించిన ఆర్.వి. కర్ణన్, హైజీన్ ప్రమాణాలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు, పబ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటి ఆహార సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఆహార భద్రతపై ప్రజలలో అవగాహన పెంచారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా కొనసాగిన కె.ఇలంబర్తి జిహెచ్ఎంసి కమిషనర్‌గా తన పదవీకాలంలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పౌర సేవల మెరుగుదల కోసం పలు కార్యక్రమాలు చేపట్ట...
Anganwadi | అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పల్లిపట్టీలు, చిరుధాన్యాల పట్టీలు!
State, Hyderabad

Anganwadi | అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పల్లిపట్టీలు, చిరుధాన్యాల పట్టీలు!

Anganwadi Centers | అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. పిల్లలకు మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణులతో కమిటీ వేశామని వివరించారు. వారి నివేదిక ఆధారంగా అంగన్వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించారు. 14 నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పల్లీ పట్టీలు, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్ లో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 23 మొబైల్ అంగన్వాడీ (Anganwadi Vehicle...
error: Content is protected !!