Sarkar Live

Hyderabad

Red Alert | తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, వాతావరణశాఖ కీలక హెచ్చరిక
State, Hyderabad

Red Alert | తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, వాతావరణశాఖ కీలక హెచ్చరిక

Telangana Rains | రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్త‌డంతో పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న‌ మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వెల్ల‌డించింది. కొన్ని జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ (Red Alert ), మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం కొత్తగూడెం, హన్మకొండ, జనగామ‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలుంటాయని తెలిపింది. ఆదిలాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్...
BRS vs Congress | నీటి ప్రాజెక్టుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం  స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌
State, Hyderabad

BRS vs Congress | నీటి ప్రాజెక్టుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌

BRS vs Congress : భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ‌కుంట్ల‌ రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt)పై ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టుల భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమ‌ర్శించారు. ముఖ్యంగా జూరాల, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్ర‌మాద‌ హెచ్చరికలు (danger warnings) వెలువడినా వాటిని పట్టించుకోవడంలేదని మండిప‌డ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాత్రమే రాజకీయం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్ల‌ర్లు దెబ్బతిన్నాయనే కారణంగా కాంగ్రెస్, బీజేపీలు నిరంతరం విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులలో కూడా మరమ్మతులు అవసరమయ్యే పరిస్థితి ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కూ కాలానుగుణంగా మరమ్మతులు అవసరం అవు...
Earthquake | వికారాబాద్‌లో  భూకంపం.. ఓవైపు భారీ వ‌ర్షాలు.. మరోవైపు ప్ర‌కంప‌న‌లు
Hyderabad, State

Earthquake | వికారాబాద్‌లో భూకంపం.. ఓవైపు భారీ వ‌ర్షాలు.. మరోవైపు ప్ర‌కంప‌న‌లు

ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు Earthquake : వికారాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్ల‌వారుజామున భూమి కంపించింది. భారీ వ‌ర్షం న‌డుమ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత న‌మోదైంద‌ని అధికారులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు మాత్రమే ఈ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ఈ సంఘటన భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో చోటుచేసుకోవడంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప్రకంపనలు ఎక్కడెక్క‌డ అంటే.. తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్, ప‌రిగి పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ప్రత్యేకంగా జిల్లాకు ఆగ్నేయ దిశలో ఉన్న మండలాల్లో ఇవి ఎక్కువగా క‌నిపించాయ‌ని స్థానికులు చెబుతున్నారు. దీని ప‌రిస్థితిపై సహజ విపత్తుల విభాగం అధికారులు సమీక్షిస్తున్నారు. Earthquake : రెండు విపత్తుల కలయిక సాధారణంగా ఒక ప్రాంతంలో ఒ...
KTR | ఆరు గ్యారెంటీలే ఆర్థిక రంగానికి నష్టం – కేటీఆర్
Hyderabad, State

KTR | ఆరు గ్యారెంటీలే ఆర్థిక రంగానికి నష్టం – కేటీఆర్

KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. కాగ్(CAG) క్వార్ట‌ర్లీ రిపోర్టుపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగ్ త్రైమాసిక నివేదిక ప్ర‌కారం రాష్ట్ర ఆదాయం బాగా త‌గ్గింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం త‌గ్గ‌డం ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్లక్ష్యం వైఫ‌ల్యంతో ఆర్థిక రంగం దెబ్బ‌తింటోంది. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి న‌ష్టం చేసింది. రాష్ట్ర ఆదాయం త‌గ్గుతుంటే.. అప్పులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ఆదాయం తగ్గుముఖం పడుతోంది, అప్పులు పెరుగుతున్నాయి. ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది సాధారణ గణితం. కాంగ్రెస్ అసమర్థత భారంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది రూ. 2,738 కోట్ల మిగులు ఉంటుంద‌ని బ‌డ్జెట్‌లో చూపారు. మొద‌టి ...
Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Hyderabad, State

Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వరదల నివారణకు ‘మూసీ పునరుజ్జీవనమే’ మంత్రం హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం తగ్గించేందుకు సీఎం ప్రత్యేక ప్రణాళిక మూసీకి అనుసంధానం – చెరువులు, కుంటలు, నాలాల కలయికతో నగర భద్రత Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేలా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Ravanth Reddy) ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్ర...
error: Content is protected !!