Sarkar Live

Hyderabad

South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు
Hyderabad, State

South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు

South Central Railway : ప్రయాణికులకు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే శుభ‌వార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి మైసూరు (Secunderabad–Mysuru), అలాగే చ‌ర్ల‌ప‌ల్లి నుంచి కాకినాడ టౌన్ (Charlapalli–Kakinada Town) మార్గాల్లో ప్రత్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రైలు ప్రయాణికుల సంఖ్య ఈ మధ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ఏసీ (AC), స్లీపర్ (Sleeper), జనరల్ (General) తరగతి కోచ్‌లు ఉండటంతో అన్ని తరగతుల ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ – మైసూరు మధ్య ప్రత్యేక రైళ్లు ఈ మార్గంలో నడిచే ప్రత్యేక రైళ్ల నంబర్లు 07033 / 07034. ఇవి ఆగస్టు 8 నుంచి 30వ తేదీ వరకు న‌డ‌వ‌నున్నాయి. మొత్తం ఎనిమిది స...
Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ
State, Hyderabad

Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ

హైదరాబాద్ : నగరంలో పనిచేస్తున్న 17 మంది ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బదిలీ (Police transfer) చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి. Police transfer బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల జాబితా షేక్ కవియుద్దీన్ (డిఐ బంజారాహిల్స్), ధమిరెడ్డి గిరి (డిఐ నారాయణగూడ), డి రామ్ బాబు (సిటిసి), ఎం బషీర్ అహ్మద్ (డిఐ మార్కెట్ పిఎస్), విక్రమ్ సింగ్ బందెలి (డిఐ లేక్ పిఎస్), నాగార్జున ధరావత్ (డిఐ కుల్సుంపురా), ఎం వర ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), అనురాధ బాల్నింగని (SHO కార్ఖానా), రమణ ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), రామకృష్ణ వలిశెట్టి (SB హైదరాబాద్), దేవేందర్ రమావత్ (ఎస్‌హెచ్‌ఓ బండ్లగూడ), గురునాథ్ కత్రావత్ (డిఐ గుడిమల్కాపూర్), వెంకట్ రెడ్డి భీమిడ్ (SHO ఖైరతాబాద్), రాజశేఖర్ శిలంపల్లె (డీఐ రాంగోపాల్‌పేట), నేతాజీ చిర్రా (SHO రెయిన్...
Kaleshwaram  | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్
Hyderabad, State

Kaleshwaram | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్

హైద‌రాబాద్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project ) పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వ‌రం రిపోర్టు పేరిట 60 పేజీల నివేదిక‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సోమ‌వారం విడుద‌ల చేస్తూ.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. కాంగ్రెస్ స‌ర్కార్ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం దీటుగా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌ల‌కు సూటిగా స‌మాధానం ఇచ్చారు. కాళేశ్వ‌రం వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ వీక్షించేందుకు అన్ని జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు కాళేశ్వ‌రం గురించి వివ...
KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి
State, Hyderabad

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హ...
HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు
State, Hyderabad

HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు

మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా హైదరాబాద్ (Hyderabad) లోని మూసీ నది (Musi River)లో ఆక్రమణలను హైడ్రా (HYDRAA) తొలగించింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసీ ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు.మంగళవారం ఉదయం నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య మూసీలో తిష్టవేసిన షెడ్డులను తొలగించారు. ఇలా ఉండగా న‌గ‌రంలోని మూసాపేట ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో అక్...
error: Content is protected !!