Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం
                    జీటో కనెక్ట్ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
Hyderabad : విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశానికి రోల్ మోడల్గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్ (Hyderabad itex), హెచ్ఐసీసీ లో మూడు రోజులపాటు జరుగుతున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధ్ బాబు మాట్లాడుతూ, “ఇప్పటి పారిశ్రామికవేత్తలు కేవలం రాయితీలు, ప్రోత్సాహకాలు కాకుండా నైతికత, సమ్మిళితత, సుస్థిరతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగ...                
                
             
								


