Khammam | జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శుభవార్త
10 రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల కోసం జీవో
వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల ప్రకటన!
Khammam : జర్నలిస్టుల చిరకాల డిమాండ్లు అయిన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) జిల్లా మహాసభలను ఉద్దేశించి ఆయన ఫోన్ ద్వారా ప్రసంగిస్తూ జర్నలిస్టులకు పలు కీలక హామీలు ఇచ్చారు.
అక్రిడిటేషన్ కార్డులపై 10 రోజుల్లో జీవో
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. రాబోయే పది రోజుల్లోనే అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భర...



