Sarkar Live

Mahaboobnagar

Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Mahaboobnagar

Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీకి ఆదేశాలు Urea Distribution in Telangana : తెలంగాణలో కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా బస్తాల కోసం పీఏసీఎస్​ ల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్​ పుస్తకాలు పెడుతున్న దృశ్యాలు కొన్నిరోజులుగా సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. తోపులాటలు, ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసింది. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశాలు జారీ చేశారు. యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ...
యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana
State, Mahaboobnagar

యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana

Narayanapet : జిల్లాలోని తిలేరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) వద్ద గురువారం యూరియా కోసం క్యూలో నిలబడి ఒక మహిళా రైతు కుప్పకూలిపోయింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్య‌లో మహిళలు సహా చాలా మంది రైతులు PACS వద్దకు తరలివచ్చారు. పీఏసీఎస్ వ‌ద్ద యూరియా (Urea shortage) కోసం క్యూలలో నిలబడాల్సి వచ్చింది. చాలా మందిలాగే, మణెమ్మ కూడా PACS వద్దకు చేరుకుని వరుసలో నిలబడి వంతు కోసం వేచి ఉంది. ఈ క్ర‌మంలో ఆమె తల తిరుగుతున్నట్లు అనిపించి కుప్పకూలిపోయింది, వెంటనే రైతులు, PACS అధికారులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మణెమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందడానికి ఏమీ లేదని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. టోకెన్‌తో పాటు, రైతుల వేలికి సిరా ఇదిలా ఉండ‌గా PACS వద్ద యూరియా (Urea ) కోసం క్యూలో ఉన్న‌వారు మ‌రోసారి రాకుండా చూసుకోవడానికి అధికారులు వారి బొటనవేళ్లపై చెరగని స...
Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి
Crime, Mahaboobnagar

Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి

Mahbubnagar Bus Accident : మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ట్రైలర్ ట్రక్కును ఒక ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టిన ప్రమాదం (Accident) లో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. 32 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు వెళుతుండగా బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గ‌ణేష్ ఊరేగింపులో.. West Godavari Accident : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో గణేష్ ఊరేగింపు సందర్భంగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి, ఒక మైనర్ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గణేష్ ...
Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం
Crime, Mahaboobnagar

Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం

Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మ‌హిళ త‌న‌ కూతురిని చంపి, ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రేబిస్‌ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకింద‌ని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది....
Road accident | జ‌డ్చ‌ర్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Crime, Mahaboobnagar

Road accident | జ‌డ్చ‌ర్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road accident | మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల ( Jadcherla) మండలం మచారం సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్ర‌మాదం (accident) జ‌రిగింది. లారీని ప్రైవేటు బ‌స్సు (Private bus) ఢీకొన‌డంతో డ్రైవ‌ర్ స‌హా ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యం 6 గంటల సమయంలో కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ముందుకు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం (Road accident)చోటుచేసుకుంది. Road accident : ఎలా జ‌రిగిందంటే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యోద‌యానికి ముందు చీక‌టి ఇంకా అలుముకొని ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బస్సు కొంత వేగంగా వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ డ్రైవ‌రు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బ‌స్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీ (lorry) వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు ...
error: Content is protected !!