జడ్చర్ల హాస్పిటల్లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident
Jadcherla Government Hospital Incident | మహబూబ్నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతి భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమనడంతో ప్రభుత్వం స్పందించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది.
Jadcherla Hospital : అసలేం జరిగింది?
జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం బంధువులు మార్చురీ వద్దకు వెళ్లగా, లోపల కుక్కల శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా, ఒక కుక్క భీమేశ్ మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని బంధ...




