పేదలకు గుడ్ న్యూస్.. తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. – Ration Cards 2025
                    రాష్ట్రంలో నిరుపేద లందరికీ తెల్ల రేషన్ కార్డులు (White Ration Cards) మంజూరు చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీని సూర్యపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (Tirumalagiri)లో ఈనెల 14 న ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులు హాజరుకానున్న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అలాగే తిరుమలగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
...                
                
             
								