Violence Against Women | ‘ఆమె’కు రక్షణ లేదా?.. వరుసగా మహిళలపై భీతిగొల్పేలా దారుణాలు
Stop Violence Against Women : హైదరాబాద్(Hyderabad) లో వరుస హత్యలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలు నగరవాసులలో భయాందోళనన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని కుక్కర్లో ఉడికించిన సంఘటన మరవకముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో మరో మహిళపై జరిగిన దారుణం కలకలం రేపుతోంది.
దిశపై జరిగిన దారుణంలా..
మునీరాబాద్ ఘటన 2019లో కలకలం రేపిన దిశ కేసును గుర్తు చేస్తోంది. ఆ ఘటనలో ఓ వెటర్నరీ డాక్టర్ను అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి నిర్మానుష్య ప్రదేశంలో తగలబెట్టారు. మునీరాబాద్లో జరిగిన హత్యలోనూ చాలా విషయాలు దిశ ఘటనకు సారూప్యంగా ఉన్నాయి. ఈ హత్యల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మహిళలపై వరుస దాడులు, హత్యలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
హత్య ఎందుకు జరిగింది?
మునీరాబాద్ ప్రాంతంలో గల...




