US urges Peaceful Resolution | విభేదాలను పరిష్కరించుకోండి.. బంగ్లా, భారత్కు యూఎస్ సూచన
US urges Peaceful Resolution : బంగ్లాదేశ్లో భారతీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో యూఎస్ స్పందించింది. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడింది. ఇటీవల భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్లో పర్యటించిన సందర్భంగా అక్కడ మైనారిటీలైన భారతీయులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరంపై యునైటెడ్ స్టేట్స్ మాట్లాడింది. స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిలర్ ఈ మేరకు మీడియా సమావేశంలో ప్రకటించారు.
Matthew Miler ఏమన్నారంటే..
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న విభేదాలన శాంతియుతంగా పరిష్కరించుకొనే ఆస్కారం ఉందని, దీన్ని ఇరు దేశాలు పరిశీలించాలని మిలర్ సూచించారు. భారత విదేశాంగ మంత్రి విక్రమ్ మిశ్రి (Vikram...




