Sarkar Live

State

Govt Schools | పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను ప్ర‌ద‌ర్శించాల్సిందే..
State

Govt Schools | పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను ప్ర‌ద‌ర్శించాల్సిందే..

Teachers Photos in Govt Schools |తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న టీచ‌ర్ల ఫొటోలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని.. పాఠశాల విద్యాశాఖ ఉత్వ‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెంట‌నే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలిచ్చారు. కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులకు బ‌దులు ఇతర ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నానే విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, ఈ విష‌య‌మై విద్యాశాఖకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని నరసింహారెడ్డి వెల్ల‌డించారు. ఇలా ఒకరికి బ‌దులు మరొకరు పనిచేస్తున్నట్లు నిర్ధార‌ణ అయితే వెంట‌నే కఠిన చర్యలు ...
రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త కొత్త రూల్‌..! ఇకపై అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోల తీయొద్దు..!
State

రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త కొత్త రూల్‌..! ఇకపై అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోల తీయొద్దు..!

TG Assembly | రాష్ట్ర ప్ర‌భుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కారు ఈ చర్యలు చేప‌ట్టింద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అసెంబ్లీ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు చాన్స్ ఉండేది. ఈ విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రాలు చెప్పేవారు కాదు. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ ఛానెల్స్‌ లైవ్‌ ఇవ్వొద్దని మాత్రం చెప్పేవారని.. ఫొటోలు, వీడియోల షూటింగ్‌ల‌పై ఆంక్షలు లేవని ప‌లువ‌రు గుర్తు చేస్తున్నారు. తాజా రేవంత్‌ ప్ర‌భుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కొత్త నిబంధనలన...
Group-2 Hall Tickets | గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు విడుదల.. డౌన్​లోడ్ చేసుకోండిలా..!
State

Group-2 Hall Tickets | గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు విడుదల.. డౌన్​లోడ్ చేసుకోండిలా..!

Group-2 Hall Tickets Realesed : గ్రూప్​-2 పరీక్ష హాల్​టికెట్లను టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. ఈమేర‌కు హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవాల‌ని అభ్యర్థులకు సూచించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ​ ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సుమారు 5.51లక్షల దరఖాస్తులు అందాయి. రెండు రోజులు ప‌రీక్ష‌లు రెండు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం మొత్తం నాలుగు పేపర్లతో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం పేపర్​ -1, పేపర్​-3లకు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను ప‌రీక్ష కేంద్రాల్లోకి ​అనుమతిస్తారు. ఒక్క నిమిషం నిబంధ‌న అమ‌లు ఉంద‌ని అభ్య‌ర్థులు గ‌మ‌నించాలి. హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను న‌మోదు చేయా...
Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా.. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ పై చర్చ
State

Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా.. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ పై చర్చ

Telangana Assembly | హైద‌రాబాద్ : రాష్ట్ర‌ శాస‌న స‌భ‌, మండలి స‌మావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా ప‌డ్డాయి. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రక‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై స‌భ్యులు మాట్లాడిన త‌ర్వాత స‌భ‌ను డిసెంబ‌ర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. అయితే అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. బీఆర్ఎస్ నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ నేత‌లు నిప్పులు చెరిగారు. అక్ర‌మ అరెస్టుల‌పై మండిప‌డ్డారు. అదానీ – రేవంత్ దోస్తానాపై ప్ర‌శ్నిస్తామ‌నే భ‌యంతోనే త‌మ‌ను అడ్డుకుంటున్నార‌ని, స‌భ‌లోని రానివ్వ‌డం లేద‌ని బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శించారు. కాగా రాష్ట్ర సచివాలయంలో రీడిజైన్ చేసిన...
KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్
State

KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్

KCR | తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూర్ఖత్వమని.. ఇవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని బీఆర్‌ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఆయ‌న‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్ర‌వ్నించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పారు. రైతుబంధు ప్రయోజనాలు ప్ర‌జ‌ల‌కు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ...
error: Content is protected !!