Sarkar Live

State

Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం
State

Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

Trains Stopped : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్​లో ఏర్ప‌డిన సాంకేతిక సమస్యతో పలు ట్రైన్స్ రాకపోకలకు అంత‌రాయం క‌లిగింది. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే వందే భారత్‌, దిల్లీ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అరగంట పాటు నిలిచిపోవాల్సి వ‌చ్చింది .సిర్పూర్ కాగజ్​నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​లు గంటన్నర పాటు నిలిచిపోయాయి. దీంతో ప‌లు రైళ్ల‌లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సింగరేణి ప్యాసింజర్‌ ఉప్పల్‌ స్టేషన్‌లో 20 నిమిషాలు నిలిచిపోయింది.మెయిన్‌లైన్‌లో ఒక‌ గూడ్స్‌ రైలు ఆగింది. మరోవైపు సిగ్న‌ల్ సమస్య కారణంగా ఉప్పల్‌ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోలేదు. ఫ‌లితంగా ఇరువైపులా రోడ్ల‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా గేట్లు తెరుచుకోకపోవడంతో హుజూరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. &nb...
కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి
State

కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా Hyderabad :  తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు తమదే అధికారం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా  (JP Nadda) అన్నారు.  దేశంలోని  విపక్ష పార్టీలన్నీ ఏకమైనా.. మూడోసారి కూడా ప్రజలు మోదీ(PM Modi)నే ప్రధానిగా ఆమోదించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి మరో ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని సూచించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో శనివారం జ‌రిగిన‌ బీజేపీ భారీ బహిరంగ సభలో జెపి.నడ్డా మాట్లాడుతూ..  ఆరు గ్యారెంటీలు, 66 అబద్ధాలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అనే సంగతి తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇతర పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్‌ (Con...
KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేవ‌ర‌కు పోరాటం
State

KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేవ‌ర‌కు పోరాటం

Hyderabad | లగచర్ల (Lagacharla) భూసేకరణ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భ‌రోసా ఇచ్చారు. భూసేక‌ర‌ణ ర‌ద్దు చేసేవ‌ర‌కు పోరాటం ఆప‌బోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు శ‌నివారం ల‌గ‌చ‌ర్ల బాధితులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో బాధితుల‌కు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వేధింపులను ఇప్ప‌టికైనా మానుకొని బాధితుల డిమాండ్లను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యే వ‌ర‌కూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంద‌ని కేటీఆర్ వారితో అన్నారు. గిరిజన భూసేకరణ బాధితులపై రేవంత్ (CM Revanth Reddy) ప్ర‌భుత్వం అన్యాయంగా పెట్టిన కేసులను భేషరతుగా ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. పోలీసుల ద్వారా ల‌గ‌చ‌ర్ల‌ బాధితుల‌ను వేధించడం నిలి...
డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ  వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
State

డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

Hyderabad : డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్  ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) వీసీగా ఘంటా చక్రపాణి (Ghanta chakrapani )ని నియమిస్తూ  ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రం ఆచార్యులుగా చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో  ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కాగా చక్రపాణి ఈ పదవీలో ముడేళ్లపాటు కొనసాగుతారు. కాగా ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్.  ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపిసి ) పూర్తి చేశ...
Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..
State

Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..

Harish Rao | కాంగ్రెస్ ఏడాది పాల‌న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తుండ‌డంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌జాస్వామ్య పాల‌న కాదు.. రాక్ష‌స పాల‌న అని ఆయ‌న మండిప‌డ్డారు.ఈ మేర‌కు హ‌రీశ్‌రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని సీఎం రేవంత రెడ్డిని నిల‌దీశారు హ‌రీశ్‌రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తిరిగి కేసు బనాయించార‌ని, ఉదయాన్నే పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అక్రమగా అరెస్టు చేసేందుకు య‌త్నించార‌ని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, త‌న‌పై, బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బె...
error: Content is protected !!