Sarkar Live

State

Foxconn | హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
State

Foxconn | హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

Hyderabad : తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ (Foxconn) తన ప‌రిశ్ర‌మ‌ను హైదరాబాద్‌కు బదులుగా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోందన్న ఊహాగానాల నేప‌థ్యంలో రాష్ట్ర‌ ఐటి, పరిశ్రమల మంత్రి డి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ త్వరలో రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభిస్తుందని మంగళవారం ప్రకటించారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. ఫాక్స్‌కాన్‌ సంస్థ హైదరాబాద్‌లో తన ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు కంపెనీ మారనున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు. “ఫాక్స్‌కాన్‌కు బెంగళూరు, చెన్నై, గుజరాత్‌లలో బేస్ ఉంది. ఇది వివిధ ప్రదేశాలలో త‌న కార్య‌కలాపాల‌ను విస్త‌రించుకోవాల‌ని భావిస్తోంద‌ని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తుంద‌ని చెప్పారు. త్వరలో Foxconn ప్రకటన దీనికి సంబంధి...
Formula E race case | రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్‌..!
State

Formula E race case | రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్‌..!

Formula E race case : 'ఫార్ములా ఈ' రేసు కేసులో త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అవినీతి నిరోధ‌క విభాగానికి (ACB) అనుమ‌తినిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యంపై భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసును న్యాయ‌ప‌రంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధ‌మేనని ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం 'X' ద్వారా ఆయ‌న మంగ‌ళ‌వారం తీవ్రంగా ప్ర‌తిస్పందించారు. కేటీఆర్ ఏమ‌న్నారంటే.. తన‌పై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి 'చిట్టి నాయుడు' అంటూ కేటీఆర్ సంభోదించారు. 'ఢిల్లీలో బీజేపీతో చేసుకున్న ఒప్పందాల ఫలితాలు కనిపిస్తున్నాయి' అని కూడా వ్యాఖ్యానించారు. ఢిల్లీకి రేవంత్‌రెడ్డి 30 సార్లు వెళ్లి రాష్ట్రానికి కొన్ని నిధులైనా తెచ్చుకోలేకపోయారని, తనపై మాత్రం మూడు కేసులు పెట్టడం ద్వారా రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు...
SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
State

SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

SBI Clerk Notification 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకి శుభవార్త అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 2024-25 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఖాళీల సంఖ్య యావత్ భారతదేశం వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 342 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ.. గడువు తేదీలు జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 డిసెంబర్ 17 దరఖాస్తు చివరి తేదీ : 2025 జనవరి 7 దరఖాస్తు లింక్ : [SBI Careers](https://bank.sbi/web/careers/current-openings...
Cold wave | తెలంగాణలో చలి పులి.. క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు
State

Cold wave | తెలంగాణలో చలి పులి.. క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు

Cold wave : తెలంగాణలో చలి తీవ్రంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాద్, భీంపూర్ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదే విధంగా పోచార, భోరాజ్, తండ్రా ప్రాంతాల్లో 6.4 నుంచి 6.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6.3 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా చ‌లి తీవ్రంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రతంగా ఉంటుంద‌ని భారత వాతావరణ శాఖ (IMD) ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ (Cold wave ) Cold wave in Hyderabad : హైదరాబాద్ నగరంలో కూడా చలితీవ్రత అధికంగా ఉంది. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న...
Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Telangana Rythu Bharosa | నిరుపేద కూలీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ఈ ప‌థ‌కాన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. డిసెంబర్‌ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని భూమి లేని నిరుపేదకు రూ. 12వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka Mallu ) ఖమ్మం జిల్లాలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ప్రతి సంవ‌త్స‌రం ఇచ్చే 12వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాపై కూడా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్ట‌త ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా డబ్బులు జ‌మ చేస్త...
error: Content is protected !!