Sarkar Live

State

Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు హాస్ట‌ళ్ల‌లో ఇక‌పై ఫుడ్ సేఫ్టీ క‌మిటీలు..
State

Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు హాస్ట‌ళ్ల‌లో ఇక‌పై ఫుడ్ సేఫ్టీ క‌మిటీలు..

Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు, వ‌స‌తిగృహాల్లో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు(Food Safety Committees) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS ShanthiKumari) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆహారభద్రతపై ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాసంస్థ అధికారి, జిల్లాస్థాయి అధికారులు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. కాగా గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధిపేటలోని గురుకుల పాఠశాలలను తనిఖీ చేసి.. ఆహార పదార్థాలను, కనీస వసతులను స్వ‌యంగా పరిశీలించారు. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభుత్వం కమిటీలను నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక...
Ram Gopal Varma | ఏపీ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా
State

Ram Gopal Varma | ఏపీ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా

అమరావతి : ప్రముఖ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ (Quash petition) పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టులో (AP High Court) విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు త‌గిన‌ సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర‌డంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఆర్జీవీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!? ఏపీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu), ఉప‌ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఫొటోలను మార్ఫింగ్ (Photos Marfing) చేసి సోష‌ల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినందుకు గాను రాంగోపాల్‌ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు రెండుసార్లు నోటీసులు అందించినా కూడా వ...
KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?
State

KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?

KTR | హైదరాబాద్‌: ప్ర‌భుత్వ పాఠ‌శాల పిల్లలకు అండ‌గా నిలిచిన భార‌త‌రాష్ట్ర స‌మితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) నాయకులను అరెస్టు చేయ‌డం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. విద్యార్థి నాయకులకు త‌క్ష‌ణ‌మే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం విద్యార్థి నేత‌ల‌ను అరెస్టు చేసి ఇప్పటికీ వారి ఆచూకీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయ‌న‌ మండి పడ్డారు. సమస్యలపై నిలదీస్తే నిర్బంధాలా?, బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ‌తారా అని విమర్శించారు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్యలు, పిల్లల మరణాల గురించి నిల‌దీస్తే గొంతు నొక్కుతారా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మా బీఆర్ఎస్‌వి నాయకులు ‘గురుకుల బాట’ చే...
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక
State

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక

Hyderabad Metro : హైదరాబాద్ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు దిల్లీకి పరిమితమైన ఈ సౌకర్యం హైదరాబాద్ కూ రానుంది. హైదరాబాద్ లో పెరిగిన రద్దీ కారణం కాగా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మూడు కారిడార్ల ద్వారా నగరవాసులకు మెట్రో సేవలు అందుతుండగా, మరో 5 కారిడార్లు రానున్నాయని చెప్పవచ్చు. ఈ 5 కారిడార్ల నిర్మాణానికి 116.4 కిలోమీటర్లు మెట్రో రవాణా సాగుతుండగా, అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఇందులో చేరనుంది. ఇది మియాపూర్ నుంమ్ర్ పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్, నాగోలు నుంమ్ర్ ఎయిర్ పోర్ట్ వ...
Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి
State

Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి

Telangana | వాణిజ్య వ్యాపారాలు విస్తరించేందుకు మంథని మంచిర్యాల ప‌ట్ట‌ణాల‌ను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని ఐటి, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) వెల్ల‌డించారు. బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మంథని పట్టణంలో యువకులకు ఉపాధి కల్పించేందుకు చిన్న సాఫ్ట్ వేర్‌ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువస్తామ‌ని తెలిపారు. అలాగే మంథ‌ని స‌మీపంలోని రామగిరి క్షేత్రాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధ‌ర్‌బాబు హామీ ఇచ్చారు. మంథని సమీపంలో గోదావరి నది పుష్కరాలు నిర్వహణకు రూ. 2 కోట్లతో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టనున్న‌ట్లు తెలిపారు. మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అవసరమైన...
error: Content is protected !!