Sarkar Live

State

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం
State

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు నీట మునిగిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ములుగును ముంచెత్తుతున్న ముసురు ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం 16.1 సెం.మీ., వెంకటాపురం 12.1 సెం.మీ., జైనథ్‌ (ఆదిలాబాద్‌)లో 11.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్‌)లో 11.3 సెం.మీ., సాత్నాల (ఆదిలాబాద్‌)లో 11 సెం.మీ. వర్షం కురిసింది. తాడ్వాయి, కన్నాయిగూడెం, ధర్మవరం, మేడారం, సిరికొండ, రాంనగర్...
Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..
Hyderabad, State

Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..

ఇద్దరు యువకులు దుర్మరణం Hyderabad News | హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతిచెందిన‌ విషాదక‌ర ఘ‌ట‌న మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) ఇదే త‌ర‌హా మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా క‌రెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండ‌గా బండ్లగూడ వద్ద గ‌ణేష్‌ విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ ప్ర‌సార‌మైంది. దీంతో ఇద్దరు యువకులకు షాక్ త‌గిలి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని హాస్పిట‌ల్ కు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా ద...
Red Alert | తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, వాతావరణశాఖ కీలక హెచ్చరిక
State, Hyderabad

Red Alert | తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, వాతావరణశాఖ కీలక హెచ్చరిక

Telangana Rains | రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్త‌డంతో పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న‌ మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వెల్ల‌డించింది. కొన్ని జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ (Red Alert ), మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం కొత్తగూడెం, హన్మకొండ, జనగామ‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలుంటాయని తెలిపింది. ఆదిలాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్...
farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో
State, Sangareddy

farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో

farmer's protest in Gajwel : రైతులు మ‌ళ్లీ రోడ్డెక్కారు. యూరియా కొర‌త (urea shortage) వ‌ల్ల త‌మ పంట‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని ఆందోళ‌నకు దిగారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ (Gajwel) సమీపంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ ర‌హ‌దారిపై ఈ రోజు పెద్ద ఎత్తున రాస్తారోకో (rasta roko) చేపట్టారు. వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు (Farmers) రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రోడ్డు పైకి వందలాది మంది రైతులు ఈ రాస్తారోకో బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో జ‌రిగింది. వంద‌లాది మంది రైతులు భారీ సంఖ్య‌లో ఉద‌యం నుంచే గజ్వేల్ (Gajwel) వద్దకు చేరారు. రోడ్డు మధ్యలో కూర్చుని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంట‌నే యూరియా సరఫరా చేయాల‌ని డిమాండ్ చేశారు. యూరియా ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ బాధ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించ...
Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్
State, Adilabad, warangal

Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్

Heavy rainfall : తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ( heavy rainfall ) ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం (Normal life) అస్త‌వ్య‌స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజుల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. Heavy rainfall : జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తం భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి రవాణా అంతరాయం కలిగిస్తున్నాయి. చిన్న చిన్న చెరువులు, గుంటలు పొంగిపొర్లి లోత‌ట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. పల్లెల్లో రహదారులు నీటమునిగిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.పంట పొలాల్లోకి కూడా నీరు చేరడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా కొన్ని ప్రాంతాల్లో వరదలు, ముంపు సమస్యలు తలెత్తుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి కొరత కొనసా...
error: Content is protected !!