KTR | ఆరు గ్యారెంటీలే ఆర్థిక రంగానికి నష్టం – కేటీఆర్
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాగ్(CAG) క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటోంది. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి నష్టం చేసింది. రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే.. అప్పులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ఆదాయం తగ్గుముఖం పడుతోంది, అప్పులు పెరుగుతున్నాయి. ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది సాధారణ గణితం. కాంగ్రెస్ అసమర్థత భారంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది
రూ. 2,738 కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్లో చూపారు. మొదటి ...




