Sarkar Live

State

జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత
Hyderabad, State

జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత

BRSV Protest in Hyderabad : రాష్ట్రంలో ఉద్యోగ నియామ‌కాల‌ను చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ యువత చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసనకు ముందు రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. BRS విద్యార్థి విభాగం (BRSV) నాయ‌కులు , నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో వివాదాస్పద పరిస్థితులు తలెత్తాయి. ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ 'చలో సెక్రటేరియట్' నిరసనకు ముందు భారత రాష్ట్ర సమితి విద్యార్థి (BRSV) మరియు నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన‌ హామీ హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. అలాగే అదుపులోకి తీసుకున్న నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిరసనకారులు డిమాండ...
Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త
Hyderabad, State

Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త

ప్రమోషన్ గరిష్ట వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంపు అంగన్వాడీ హెల్పర్ల (Anganwadi Helpers) కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి (Promotion) పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) గురువారం సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడుతుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్లీ చాన్స్ లభించనుంది. Anganwadi హెల్పర్స్ యూనియన్స్ వినతి మేరకు.. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడీ హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్య...
Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ
warangal, State

Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ

వివాదాల నడుమ కీలక పరిణామం 16 పేజీల నివేదికతో మీనాక్షి నటరాజన్‌ను కలుసిన సురేఖ Warangal News | కొండా మురళి.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ గా చేసిన విమర్శలు కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ఆయ‌న‌ విమర్శించారు. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే గురువారం తన సతీమణి, మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తో కలిసి కొండా ముర‌ళి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) తో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అలాగే మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ అంద‌జేశారు. Kond...
Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి
Crime, Sangareddy

Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి

Sangareddy News : సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరియాల్ (Cheriyal) వద్ద NH-65 పై వేగంగా వస్తున్న లారీ ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎస్సై ప్రాణాలు కోల్పోడారు. వివ‌రాల్లోకి వెళితే.. సంగారెడ్డి పట్టణం (Sangareddy City) లోని చాణిక్యపురి కాలనీలో ఉంటున్న రాజేశ్వర్ (59) ఫిల్మ్ నగర్ (Film nagar) పోలీస్ స్టేషన్‌లో SIగా పనిచేస్తున్నారు. బల్కంపేట బోనాలు ఉత్సవాల్లో విధుల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. దీంతో రాజేశ్వర్ తన విధుల‌ను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి బ‌య‌లుదేరాడు. ఈక్ర‌మంలో చేరియాల్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు అత‌డిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో త‌ర‌లించ‌గా అక్క‌డ‌ చికిత్స పొందుతూ గంట తర్వాత మరణించారు. రాజేశ్వర్ వారం క్రితం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చేరారని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది . రాజేశ్వర్ 1990లో ...
Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు
State, warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు

Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది.  రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.  జ‌న‌వ‌రి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీల‌క‌మైన ఘ‌ట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో  వెల్లడించారు....
error: Content is protected !!