Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి
Sangareddy News : సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరియాల్ (Cheriyal) వద్ద NH-65 పై వేగంగా వస్తున్న లారీ ఒక సబ్-ఇన్స్పెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎస్సై ప్రాణాలు కోల్పోడారు. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి పట్టణం (Sangareddy City) లోని చాణిక్యపురి కాలనీలో ఉంటున్న రాజేశ్వర్ (59) ఫిల్మ్ నగర్ (Film nagar) పోలీస్ స్టేషన్లో SIగా పనిచేస్తున్నారు. బల్కంపేట బోనాలు ఉత్సవాల్లో విధులను ఆయనకు అప్పగించారు. దీంతో రాజేశ్వర్ తన విధులను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఈక్రమంలో చేరియాల్ వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంట తర్వాత మరణించారు. రాజేశ్వర్ వారం క్రితం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో చేరారని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది . రాజేశ్వర్ 1990లో ...