Sarkar Live

World

Nobel Peace Prize 2025 :   వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
World

Nobel Peace Prize 2025 : వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

Nobel Peace Prize 2025 : 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరిపోయింది. వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు ఈ గౌరవం లభించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆమె అవిశ్రాంత పోరాటం చేసినందుకు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పుర‌స్కారం లభించింది. వెనిజులాను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మార‌డానికి ఆమె నాయకత్వం, పోరాటాన్ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఆమె ప్రయత్నాలను "ప్రజాస్వామ్య విలువల ప్రపంచ రక్షణకు చిహ్నం"గా నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఇది డోనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోవాలనే కలను చెదరగొట్టింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు. "ఆమె ప్రాణాలకు తీవ్రమైన బెద...
Hyderabad : స్వ‌ల్ప వాగ్వాదం.. ప్రాణాలు బ‌లిగొన్న స్నేహితుడు
World

Hyderabad : స్వ‌ల్ప వాగ్వాదం.. ప్రాణాలు బ‌లిగొన్న స్నేహితుడు

Violence among friends : హైద‌రాబాద్ (Hyderabad ) నగరంలోని పేటబ‌షీరాబాద్ (Petbasheerabad)లో ఘోరం చోటుచేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో స్నేహితుల మ‌ధ్య జ‌రిగిన స్వ‌ల్ప వాగ్వాదం ఘ‌ర్ష‌ణ‌గా మారి ఒక‌రి ప్రాణాల‌ను బ‌లిగొంది. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. Violence among friends : అస‌లు ఏం జ‌రిగిందంటే… దులపల్లి (Dulapally) ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (37) స్టీల్ సిటీ ప్రాంతంలో పలు షెడ్లను (owned several sheds) కలిగి ఉండేవాడు. వాటిని అద్దెకు ఇచ్చి జీవనం సాగించేవాడు. అతడి స్నేహితుడు అలీ ఆటో ట్రాలీల ( auto-trolleys)ను నడిపేవాడు. ఇద్దరి మధ్య‌ వ్యాపార సంబంధాలు ఉండేవి. భారీ సరుకు రవాణా అవసరమయ్యే కస్టమర్లను అలీ తరచూ షాపూర్‌నగర్‌కు చెందిన క్రేన్ ఆపరేటర్ (crane operator) ఆనంద్‌కు సూచించేవాడు… అమెరికాలో పోలీసుల కాల్పులు.. యువ‌కుడి మృతి Mahabubnagar : అమెరికా...
Tariffs War | ట్రంప్ 50% సుంకాల రికవరీ నేటి నుండి ప్రారంభం.. ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటుంది?
World

Tariffs War | ట్రంప్ 50% సుంకాల రికవరీ నేటి నుండి ప్రారంభం.. ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటుంది?

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత వస్తువులపై 50% సుంకం (Tariffs) విధించారు. ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఇప్పటికే భారత వస్తువులపై 25% సుంకం విధిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25% సుంకం విధించింది. వీటి సేకరణ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశ దాదాపు $48.2 బిలియన్ల ఎగుమతులను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఎక్కువగా దెబ్బ‌తినే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీటిలో వస్త్రాలు (Textile Industry), రొయ్యలు, తోలు, వజ్రాలు, ఆభరణాలు, తివాచీలు, ఫర్నిచర్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. ఈ వస్తువుల ఎగుమతి (Indian Exports) ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సుంకం మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులపై ఎటువంటి ప్రభావం చూపదు. ట్రంప్ సుంకం కారణంగా, అమెరికాకు ఎగుమతుల విలువ గత సంవ...
Hormuz Strait | అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. భార‌త్ – చైనాపై తీవ్ర ప్ర‌భావం
World

Hormuz Strait | అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. భార‌త్ – చైనాపై తీవ్ర ప్ర‌భావం

అమెరికా దాడి తర్వాత, ఇరాన్ తీవ్ర నిర్ణ‌యం తీసుకుంది. దీంతో భార‌త్‌, చైనాపై భారీ న‌ష్టం క‌లుగ‌నుంది. అత్యంత కీల‌క‌మైన‌ హార్ముజ్ జలసంధి (Hormuz Strait )ని మూసివేయాలనే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థకు పంపి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తే, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు ఎక్కువగా నష్టపోతాయి. ఇది మాత్రమే కాదు, ఈ జలసంధి ద్వారా తమ చమురును ఎగుమతి చేసే గల్ఫ్ దేశాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ నిర్ణయం ఇరాన్ అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్ లేదా అమెరికాపై ఎటువంటి పెద్ద ప్రభావాన్ని చూపదు. హార్ముజ్ జలసంధి (Hormuz Strait ) అంటే ఏమిటి? ఇది ఇరాన్, ఒమన్ దేశాల‌ మధ్య ఉన్న ఇరుకైన అతి ముఖ్యమైన జలమార్గం. ఈ జలసంధి ఉత్తరాన పర్షియన్ గల్ఫ్‌ను దక్షిణాన ఒమన్ గల్ఫ్‌తో కలుపుతుంది. ఇది అరేబియా సముద్రంలోకి విస్తరించి ఉంది....
ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం..  భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict
World

ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం.. భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు (Israel Iran Conflict) రోజురోజుకు తీవ్ర‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయిల్ లో భారతీయ పౌరులను తరలించే ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామని భారత్ గురువారం ప్రకటించింది, గగనతల పరిమితుల కారణంగా వారు భూ సరిహద్దుల ద్వారా బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్‌లోని భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన ఆపరేషన్ కింద ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించనుంది. "ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ఇజ్రాయెల్ నుంచి బయలుదేరాలనుకునే భారతీయ పౌరులను వెంట‌నే తీసుకురావాల‌ని భారత ప్రభుత్వం నిర్ణయించింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వారి ప్రయాణానికి భూ సరిహద్దుల గుండా, ఆ తరువాత భారతదేశానికి వాయుమార్గం ద్వారా సౌకర్యాలు కల్పించబడతాయి" అని ప్రకటనల...
error: Content is protected !!