Sarkar Live

World

ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం..  భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict
World

ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం.. భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు (Israel Iran Conflict) రోజురోజుకు తీవ్ర‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయిల్ లో భారతీయ పౌరులను తరలించే ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామని భారత్ గురువారం ప్రకటించింది, గగనతల పరిమితుల కారణంగా వారు భూ సరిహద్దుల ద్వారా బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్‌లోని భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన ఆపరేషన్ కింద ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించనుంది. "ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ఇజ్రాయెల్ నుంచి బయలుదేరాలనుకునే భారతీయ పౌరులను వెంట‌నే తీసుకురావాల‌ని భారత ప్రభుత్వం నిర్ణయించింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వారి ప్రయాణానికి భూ సరిహద్దుల గుండా, ఆ తరువాత భారతదేశానికి వాయుమార్గం ద్వారా సౌకర్యాలు కల్పించబడతాయి" అని ప్రకటనల...
Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?
World

Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?

Galwan | ఐదేళ్ల క్రితం 2020 జూన్ 15న, తూర్పు లడఖ్‌లో చైనాతో జరిగిన గాల్వన్ లోయ ఘర్షణలో భారతదేశం 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ సంఘటన భారతదేశం-చైనా సంబంధాలను పూర్తిగా మార్చివేసింది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారతదేశ రక్షణ ప‌రిస్థితులు, వ్యూహాత్మక ప్రణాళికలో సంస్కరణలకు దారితీసింది. ప్రస్తుత ప్రోటోకాల్‌ల ప్రకారం భారత దళాలు తుపాకీలు లేకుండానే ప్రతీకారం తీర్చుకున్న గాల్వన్ ఘర్షణ చైనా వైపు కూడా గణనీయమైన ప్రాణనష్టానికి కారణమైంది, రెండు పొరుగు దేశాల‌ మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత సంవత్సరాల్లో, భారతదేశం తన సైనిక సంసిద్ధతను గణనీయంగా పునర్నిర్మించింది, సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది మరియు దౌత్య కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. భారత సాయుధ దళాలు LAC అంతటా, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో తమ ఉనికిని పెంచుకున్నాయి, దళాలను, అధిక ఎత్తులో యుద్ధ పరికరాలను వేగంగా మోహరించాయి. Galwa...
PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం
World, National

PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం

G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధ‌మ‌వుతున్నారు. సైప్రస్‌, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ‌ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల‌ తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావ‌డం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ సైప్రస్‌ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్‌ యూనియన్‌లతో సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీల‌క ఒప్పందాలు జరగనున్నాయి. ఇక సైప్ర‌స్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బ‌య‌లుదేరివెళ్ల‌నున్నారు. ఆ దేశ నూత‌న‌ ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వ...
Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..
World

Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..

Boycott Turkey Trend in India న్యూఢిల్లీ : / టర్కీ (తుర్కియే) చాలా సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్‌లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పరిస్థితి పూర్తగా రివర్స్ అయింది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడమే కాకుండా.. డ్రోన్లను సరఫరా చేసి ఇపుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం.. భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా బాక్ కాట్ టర్కీ (Boycott Turkey) నినాదంతో టర్కీ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. Boycott Turkey : దేశవ్యాప్తంగా ఇపుడు ఇదే ట్రెండ్ దిల్లీలోని ITO వద్ద చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ CTI నాయకత్వంలో తుర్కియే (turkiye) , అజర్‌బైజాన్‌ (Azerbaijan) లకు వ్యతిరే...
UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!
World

UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!

India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అంశాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (UN Security Council) స‌మావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాద‌న‌ల‌ను కొట్టివేస్తూ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. పెహల్గామ్ లో జ‌రిగిన పాశవిక దాడి వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ హ‌స్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌దేశాలు పాకిస్థాన్‌ను గ‌ట్టిగా నిల‌దీశాయి. పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యూఎన్ తేల్చి చెప్పింది. మ‌తం పేరిట ప‌ర్యాట‌కుల‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు (UN Security Council) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చేప‌డుతున్న క్షిప‌ణి ప‌రీక్ష‌లు కూడా సమావేశంలో ప్రస్తావించారు. క్షీపణి పరీక్షలను యూ...
error: Content is protected !!