UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!
India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) సమావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాదనలను కొట్టివేస్తూ భద్రతా మండలి సభ్యులు కొన్ని ప్రశ్నలు సంధించారు. పెహల్గామ్ లో జరిగిన పాశవిక దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భద్రతా మండలి సభ్యదేశాలు పాకిస్థాన్ను గట్టిగా నిలదీశాయి. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద ఘటనను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘటన పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని యూఎన్ తేల్చి చెప్పింది.
మతం పేరిట పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడాన్ని భద్రతా మండలి సభ్యులు (UN Security Council) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చేపడుతున్న క్షిపణి పరీక్షలు కూడా సమావేశంలో ప్రస్తావించారు. క్షీపణి పరీక్షలను యూ...