Sarkar Live

World

Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం
World

Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం

Pope Francis Passes Away : రోమన్ కాథలిక్ (Roman Catholic) ప్రధాన పురోహితుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇకలేరు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న 88 ఏళ్ల వ‌య‌సులో క‌నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసమైన కాసా సాంటా మార్టా (Casa Santa Marta) లో ఇవాళ తుది శ్వాస విడిచారు. వాటికన్ సిటీ అధికారులు (Vatican authorities) ఈ మేర‌కు ప్రకటించారు. Pope Francis Passes : జీవిత నేప‌థ్యం ఇదీ.. పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబరు 17న అర్జెంటీనాలో పుట్టారు. ఆయ‌న అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో (Jorge Mario Bergoglio). విద్య, తత్వశాస్త్రం, ధార్మిక పాఠ్యాంశాల‌ అధ్యయనం అనంతరం మతపరంగా సేవలు ప్రారంభించారు. 2013 మార్చి 13న పోప్ బెనెడిక్ట్ (Pope Benedict) XVI రాజీనామా చేసిన అనంతరం పోప్ ఫ్రాన్సిస్ 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా నియమితులైన తొలి వ్యక్తి (first Pope from the American contine...
Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌
World

Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ‘ఒసాకా ఎక్స్‌పో’ (Osaka Expo 2025) లో తెలంగాణ రాష్ట్రం తన పెవిలియన్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. Osaka Expo 2025 : తొలి రాష్ట్రంగా తెలంగాణ భారత్ పెవిలియన్‌లోకి ప్రవేశించి తెలంగాణ జోన్‌ను ఆవిష్కరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ (Japan) లేదా ఎక్స్‌పోను సందర్శించడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ (Telangana), ఒసాకా ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి భారతీయ రాష్ట్రం కూడా. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకు...
Israel Hamas War : గాజాలో ఇజ్రాయెల్ మరో కొత్త  సైనిక ఆపరేషన్..
World

Israel Hamas War : గాజాలో ఇజ్రాయెల్ మరో కొత్త సైనిక ఆపరేషన్..

Israel Hamas War : గాజాలోని ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం కొత్తగా మ‌రో ఆపరేషన్ ప్రారంభించింది. అదే సమయంలో, ఐడిఎఫ్ హమాస్ గాజా స్ట్రిప్‌లోని ఇతర ఉగ్రవాద లక్ష్యాలపై వైమానిక దాడులను కొనసాగిస్తోంది. అక్టోబర్ 7న హత్యకు గురైన మెనాచెమ్ గొడ్దార్డ్ కు చెందిన వస్తువులు గాజాలో కనుగొన్నారు. అతని శరీరం ల‌భ్యం కాలేదు. Israel Hamas War : హమాస్ మౌలిక సదుపాయాలు ధ్వంసం గాజా ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం కొత్త ఆపరేషన్ ప్రారంభించింది.. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని భద్రతను విస్తరించే లక్ష్యంతో గాజాలోని రఫాలోని అల్-జెనినా పరిసరాల్లో తమ దళాలు భూ ఆపరేషన్ ప్రారంభించాయని ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ రక్షణ దళాలు) తెలిపింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా బలగాలు హమాస్ సంస్థకు చెందిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి.గాజా స్ట్రిప్‌లోని హమాస్, ఇతర ఉగ్రవాద లక్ష్యాలపై ఐడిఎఫ్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది.వారాంతంలో ధ్వంసమైన...
Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌
World

Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌

Myanmar Earthquake | మ‌యన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం (7.7 magnitude earthquake) ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వందలాది భవనాలు కూలిపోగా (Building Collapse) వేలాది మంది గాయపడ్డారు. శనివారం వరకు మరణించిన వారి సంఖ్య 1002గా నమోదైంది. గాయపడినవారి సంఖ్య 2376కి చేరింది. ఇంకా 30 మంది (more bodies) ఆచూకీ గల్లంతైంది. కూలిన భ‌వ‌నాలు.. నేల‌మ‌ట్ట‌మైన వంతెన‌లు భూకంప ప్రభావంతో మయన్మార్ (Myanmar )లోని ప్రధాన నగరాలు మాండలే, నేపీడా, బాగో, యాంగాన్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, రహదారులు (Road Cracks) ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని వంతెనలు నేలమట్టమయ్యాయి (Bridges Collapse). భూకంప దాటికి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీరు పైకి పొంగి వరదలా మారింది. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం సహాయక (Rescue Efforts) బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడ్డంకిగా అత్యురుద్ధం మయన్మార్ (Myanmar)లో...
Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌
World

Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌

Death sentence : విదేశాల్లో ఉన్న భార‌తీయుల్లో 49 మంది భారతీయులు మ‌ర‌ణ శిక్ష (Indians face Death sentence ) ను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియా (Saudi Arabia), యులైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) స‌హా మొత్తం ఎనిమిది దేశాల్లో మ‌న భార‌తీయులు మ‌ర‌ణ శిక్ష‌ను ఎదుర్కొంటున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం (Indian government) వెల్ల‌డించిన తాజా నివేదిక చెబుతోంది. మొత్తం 10,152 మంది భారతీయులు విదేశాల్లో జైళ్లలో ఉన్నార‌ని తెలిపింది. వీరిలో శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌తోపాటు విచార‌ణలో ఉన్నవారు కూడా ఉన్నార‌ని వెల్ల‌డించింది. Death sentence : యుఏఈలోనే ఎక్కువ‌ భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం.. మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుల్లో అత్యధికులు UAE లో ఉన్నారు. మొత్తం 25 మంది భారతీయులు అక్క‌డ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటివరకు వీరి శిక్ష అమలుకు సంబంధించిన అధికారిక ప్ర...
error: Content is protected !!