Death sentence | విదేశాల్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్.. కేంద్రం సీరియస్
Death sentence : విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 49 మంది భారతీయులు మరణ శిక్ష (Indians face Death sentence ) ను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియా (Saudi Arabia), యులైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సహా మొత్తం ఎనిమిది దేశాల్లో మన భారతీయులు మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం (Indian government) వెల్లడించిన తాజా నివేదిక చెబుతోంది. మొత్తం 10,152 మంది భారతీయులు విదేశాల్లో జైళ్లలో ఉన్నారని తెలిపింది. వీరిలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతోపాటు విచారణలో ఉన్నవారు కూడా ఉన్నారని వెల్లడించింది.
Death sentence : యుఏఈలోనే ఎక్కువ
భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం.. మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుల్లో అత్యధికులు UAE లో ఉన్నారు. మొత్తం 25 మంది భారతీయులు అక్కడ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటివరకు వీరి శిక్ష అమలుకు సంబంధించిన అధికారిక ప్ర...




