Sarkar Live

World

Chandra Arya : కెనడా ప్రధాని రేసులో భారతీయ సంతతికి చెందిన చంద్ర ఆర్య..
World

Chandra Arya : కెనడా ప్రధాని రేసులో భారతీయ సంతతికి చెందిన చంద్ర ఆర్య..

కెన‌డా(Canada)లో భారత సంతతికి చెందిన‌ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య ( Chandra Arya) కెనడా ప్రధానమంత్రి పదవికి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలోని కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన చంద్ర ఆర్య, ఈ వారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్నడలో ప్రసంగించారు. తన లోతైన సాంస్కృతిక వారసత్వాన్ని. తన మూలాలను మ‌ర్చిపోకుండా క‌న్న‌డ‌లో మాట్లాడారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పదవీవిరమణ నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే అతని ప్రకటన వచ్చింది, అయితే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. కర్ణాటక (Karnataka) లోని ధార్వాడ్‌ (Dharwad) లో ఎంబీఏ పూర్తి చేసిన చంద్ర ఆర్య కొత్త అవకాశాల కోసం కెనడా వెళ్లారు. కొన్ని సంవత్సరాలుగా అతను కెనడియన్ రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదుగుతూ వచ్చారు. నేపియన్ నుంచి ఆయ‌న‌ పార్లమెంటు సభ్యుడిగా ప...
White House : అమెరికాలో తెలుగోడికి జైలు శిక్ష‌.. కేసు ఏమిటంటే..
World

White House : అమెరికాలో తెలుగోడికి జైలు శిక్ష‌.. కేసు ఏమిటంటే..

అమెరికాలోని అధ్య‌క్ష భ‌వ‌నం వైట్‌హౌస్ (White House)పై దాడి య‌త్నం కేసులో తెలుగు సంత‌తికి చెందిన 20 ఏళ్ల యువ‌కుడు సాయి వ‌ర్షిత్ కందుల (ai Varshith Kandula)కు అక్క‌డి ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల జైలు శిక్ష‌ను విధించింది. నాజీ సిద్ధాంతాల‌కు ప్రేరేపితుడైన అత‌డు అమెరికా ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ దాడి చేశాడ‌ని నిర్ధార‌ణ కావ‌డంతో ఈ శిక్ష‌ణు విధిస్తున్నామ‌ని అక్క‌డి న్యాయ‌స్థానం పేర్కొంది. సాయి వర్షిత్ కందుల హైద‌రాబాద్ (Hyderabad)లోని చంద్రాన‌గ‌ర్ ప్రాంతానికి చెందినవాడు. అమెరికా ( America White House )లో అతడు గ్రీన్ కార్డ్ హోల్డ‌ర్‌. కేసు పూర్వ‌ప‌రాలు కోర్టులో స‌మ‌ర్పించిన ప‌త్రాల వివ‌రాల ప్ర‌కారం… 2023 మే 22న సాయంత్రం సాయి వర్షిత్ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డిసి (Washington DC) వెళ్లాడు. సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో డల్లస్ అంతర...
Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూసివేత.. పుంజుకున్న స్టాక్ మార్కెట్
World

Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూసివేత.. పుంజుకున్న స్టాక్ మార్కెట్

Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూత‌ప‌డింది. త‌మ కార్యకలాపాలను ఇక కొన‌సాగించ‌లేమ‌ని యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఇందులో ఎవ‌రి ఒత్తిడి లేదని, త‌మ ప్రాజెక్టుల ల‌క్ష్యాలు పూర్త‌యిన నేప‌థ్యంలో హిండెన్‌బ‌ర్గ్ రిసెర్చ్ సంస్థ‌ను మూసివేస్తున్నామ‌ని ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు నాథ‌న్ అండ‌ర్స‌న్ వెల్ల‌డించారు. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స్టాక్‌ మార్కెట్‌లో సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్యంగా గౌత‌మ్ అదానీ గ్రూప్‌న‌కు చెందిన షేర్లు ఒక్క‌సారిగా భారీగా పెరుగుతున్నాయి. న‌ష్టం నుంచి లాభాల వైపు రెండేళ్ల క్రితం ఇదే నెలలో హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్లు న‌ష్ట‌పోయారు. తాజాగా హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూసివేత వార్త‌ల నేప‌థ్యంలో అదానీ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మూసివేయాలనే నిర్ణయం ప్రభావం అదానీ గ్రూప్ షేర్లపై స్పష్టంగ...
Donald Trump |  ట్రంప్‌ను వెంటాడుతున్న క‌ష్టాలు.. పీఠం ఎక్కేందుకు అవ‌రోధాలు
World

Donald Trump | ట్రంప్‌ను వెంటాడుతున్న క‌ష్టాలు.. పీఠం ఎక్కేందుకు అవ‌రోధాలు

New York : డోలాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ను క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైనా ఆ పీఠం ఎక్క‌డానికి అనేక అవ‌రోధాలు ఎదురవుతున్నాయి. హాష్ మ‌నీ కేసులో ఆయ‌న‌కు మ‌రోసారి చుక్కెదురైంది. శిక్ష విధింపును వాయిదా వేయాల‌నే అభ్య‌ర్థ‌న‌ను అమెరికా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. దేశ అధ్య‌క్షుడిగా ఈ కేసులో మిన‌హాయింపులు, వెసులుబాటు క‌ల్పించాల‌ని ట్రంప్ ఇప్పటికే ప‌లుమార్లున్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్క‌గా ఆయ‌న‌కు మ‌రోసారి షాక్ త‌గిలింది. ట్రంప్‌ స‌మ‌ర్పించిన పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్కరిస్తున్న ఆ న్యాయ‌స్థానం తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో ఆయ‌న‌కు ఎలాంటి మిన‌హాంపులు ఉండబోమ‌ని స్ప‌ష్టం చేసింది. పోర్న్‌స్టార్‌కు డ‌బ్బులు ఇచ్చార‌ని.. ట్రంప్‌పై న‌మోదైన హాష్‌మ‌నీ కేసు (Hush money case) గత ఎన్నిక‌ల నాటిది. పోర్న్ స్టార్ స్టోర్మీ డ...
Tibet earthquake | టిబెట్‌లో భారీ భూకంపం.. 95 మంది మృతి.. 130 మందికి గాయాలు
World

Tibet earthquake | టిబెట్‌లో భారీ భూకంపం.. 95 మంది మృతి.. 130 మందికి గాయాలు

Tibet earthquake : టిబెట్‌లో ఈ రోజు భారీ భూకంపం సంభ‌వించింది. దీంతో 95 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు (జీఎంటీ 01:00) జ‌రిగింది. టిబెట్‌ (Tibet) పవిత్ర నగరం శిగత్సే వద్ద సంభవించింది. దీని తీవ్రత 7.1గా న‌మోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో (6 మైళ్ల లోతు) ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అదే ప్రాంతంలో పలు ఆఫ్టర్‌షాక్స్ (అనంతర ప్రకంపనలు) కూడా నమోదయ్యాయి. ఇవి పొరుగు దేశాలైన నేపాల్ (Nepal), భారత్‌ (India)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా క‌నిపించాయి. Tibet earthquake : పవిత్ర నగరం శిగత్సే శిగత్సే టిబెట్‌లో పవిత్ర నగరం. ఇది పాంచెన్ లామా అనే ముఖ్యమైన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు స్థానం.టిబెట్‌ను చైనా (China) 1950లో ఆక్రమించింది. అనంత‌రం అక్క‌డి జ‌నం అనేక ఆంక్ష‌ల మ‌ధ్య జీవిస్తున్నారు. ...
error: Content is protected !!