Sarkar Live

Ugadi celebrations | అంద‌రూ సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాలి.. ఉగాది వేడుకల్లో సీఎం

Telangana Ugadi celebrations : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్ష‌లు (CM Revanth Reddy Ugadi wishes) తెలిపారు. విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రంలో ప్ర‌తి ఒక్క‌రికీ శుభాలు జ‌ర‌గాల‌ని కోరుకున్నారు. అంద‌రికీ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించి

Ugadi celebrations

Telangana Ugadi celebrations : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్ష‌లు (CM Revanth Reddy Ugadi wishes) తెలిపారు. విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రంలో ప్ర‌తి ఒక్క‌రికీ శుభాలు జ‌ర‌గాల‌ని కోరుకున్నారు. అంద‌రికీ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించి సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ‌ల సంయుక్త ఆధ్వర్వంలో హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో ఈ రోజు ఉగాది వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తోపాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్‌, ఎమ్మెల్యేల‌లు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, శంక‌ర‌య్య‌, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీఈ మ‌హేంద‌ర్‌రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

ఉగాది పచ్చడిగా రాష్ట్ర బ‌డ్జెట్‌

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన బడ్జెట్ (Telangana state budget 2025) ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితమని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామ‌న్నారు. వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం లాంటి కీల‌క రంగాల అభివృద్ధికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించామని తెలిపారు.

తెలంగాణ వెలిగిపోవాలి

తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళిక (Telangana Rising 2050 plan)తో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ దేశంలో మ‌న రాష్ట్రం ఒక వెలుగు వెలగాల‌న్నారు. యావ‌త్ భార‌త‌దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. ఫ్యూచర్ సిటీ (Future city development Telangana) నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టింద‌న్నారు. పెట్టుబడుల నగరంగా హైద‌రాబాద్‌ అభివృద్ధి (Hyderabad investment hub) చెందుతోంద‌ని తెలిపారు.

Ugadi celebrations : సీఎం ఇంకా ఏమ‌న్నారంటే..

దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (Food Security Act India)ను తీసుకొచ్చి పేదలకు ఆకలి తీర్చిన‌ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే (Congress government) త‌మకు ఆద‌ర్శ‌మ‌న్నారు. పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజు నుంచి శ్రీకారం చుడుతున్నామ‌ని అన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ (Paddy production Telangana) ముందుభాగంలో నిలిచింద‌ని, రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నామ‌ని చెప్పారు. ఆదాయం పెంచాలి… పేదలకు పెంచాలన్నదే త‌మ ప్రభుత్వ విధాన‌మ‌ని తెలిపారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాద‌ని, అభివృద్ధి చేసే సందర్భం అని వ్యాఖ్యానించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!