Sarkar Live

Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట

Formula E Car Case | మాజీ మంత్రి కె.తార‌క రామారావు (KT Rama rao)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని కేటీఆర్ స‌మ‌ర్పించిన లంచ్‌

Formula E Car Case

Formula E Car Case | మాజీ మంత్రి కె.తార‌క రామారావు (KT Rama rao)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని కేటీఆర్ స‌మ‌ర్పించిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై హైకోర్టులో శుక్ర‌వారం విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. మ‌రోవైపు కేటీఆర్‌పై ఏసీబీ(ACB) నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవ‌చ్చని పేర్కొంది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు (High Court ) ఈనెల 27కి వాయిదా వేసింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి కోరారు. కేటీఆర్‌ ‌తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది సుందరం ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద న‌మోదు చేసిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్ ను క్వాష్‌ ‌చేయాలని వారు కోరారు.

‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసు (Formula E Car Case) కు వర్తించవ‌ని, ఇందులో ప్ర‌ధానంగా 13(1)(జీ) సెక్షన్‌ వర్తించద‌న్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనేదానికి ఎలాంటి ఆధారాలు లేని, నిబంధ‌న‌లు పాటించలేదనని పేర్కొన‌డం సరికాద‌ని అన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. ప్రాథమిక విచారణ లేకుండా కేసు న‌మోదుచేశారు. కేటీఆర్‌పై కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేసు పెట్టారు.ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని ప్ర‌భాక‌ర్ రావు వాద‌న‌లు వినిపించారు. కార్‌ ‌రేస్‌ ‌నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింద‌ని, సీజన్‌ 10 ‌నిర్వహణకు స్పాన్సర్‌ ‌వెనక్కి తగ్గారు. రేస్‌ ‌నిర్వహణలో ఇబ్బందులను తొల‌గించేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్‌ఎం‌డీఏ చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. సీజన్‌-9 ‌తోనే సుమారు రూ.700 కోట్ల వ‌ర‌కు లాభాలు వ‌చ్చాయ‌ని, ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కార్‌ ‌రేస్ ఒప్పందాన్ని కొత్తగా వ‌చ్చిన‌ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఈ ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో డీల్ రద్దయింది. ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదులో ఆలస్యానికి కారణాలు పేర్కొన‌లేదు.

సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదులో జాప్యం స‌రికాదు. ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు గ‌తంలో వెల్ల‌డించాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పూర్తిగా విస్మ‌రించారు.ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాల్సి ఉటుంది. 18వ తేదీన ఫిర్యాదు అందడంతోనే 19వ తేదీన‌ ఎఫ్‌ఐఆర్ పైల్‌ చేశారు. కేటీఆర్‌ ‌స్పెక్యులేషన్‌ ‌చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో కూడా చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద ఆయ‌న‌పై కేసు పెట్టారు‘ అని కేటీఆర్‌ ‌తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

3 thoughts on “Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!