Rekha Gupta : ఢిల్లీ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చారిత్రిక రాంలీల మైదానం (Ramlila Ground) ఈ మహోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఇతర అగ్రనేతలు, ఎన్డీయే ముఖ్యనేతల సమక్షంలో రేఖా గుప్తా (Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేశారు.
ఏన్డీయే ఏకైక సీఎం Rekha Gupta
రేఖా గుప్తా ఢిల్లీలో నాలుగో మహిళా ముఖ్యమంత్రి. ఎన్డీయే కూటమిలో ముఖ్యమంత్రుల బృందం (NDA chief ministers)లో ఆమె ఏకైక సీఎం. 50 ఏళ్ల రేఖా గుప్తా షాలిమార్బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పార్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తదితర బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాల సీఎంలు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Delhi CM Rekha Gupta : ఎవరు ఈమె?
సుష్మా స్వరాజ్ తర్వాత బీజేపీ నుంచి ఢిల్లీ రెండో మహిళా ముఖ్యమంత్రి (Chief Minister of Delhi)గా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి బందనా కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించారు. రేఖా గుప్తా 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, దౌలత్ రామ్ కాలేజ్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) అధ్యక్షురాలిగా కొనసాగారు. 2007లో ఉత్తర పిటంపురా నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు.
రేఖా గుప్తా ముందున్న సవాళ్లు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తా ముందు ఢిల్లీ (Delhi) అభివృద్ధికి సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. ఢిల్లీలో మహిళల భద్రతను మెరుగుపరచడం అత్యంత ప్రధానమైనదని అక్కడి ప్రజలు అంటున్నారు. మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను తగ్గించేందుకు సమర్థ చర్యలు తీసుకోవాల్సి ఉందని కోరుతున్నారు. నగరంలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడం, చెత్త నిర్వహణను మెరుగుపరచడం అవసరమని అంటున్నన్నారు. నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాను నిర్ధారించడం, విద్యుత్ కోతలను తగ్గించడం, పునరుత్పత్తి శక్తి వనరులను ప్రోత్సహించడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం, ఉపాధ్యాయుల శిక్షణపై దృష్టి పెట్టడం లాంటి చర్యలు చేపట్టాల్సి ఉందని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..